News October 10, 2025

ప్రకాశం: ‘సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం’

image

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా వ్యవహరించడంతోపాటు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవల పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ వ్యాధులు – మందుల పంపిణీ అంశాలపై జేసీ గోపాలకృష్ణ వీడియో కాన్ఫరెన్స్లో వివరణ ఇచ్చారు.

Similar News

News October 10, 2025

ఒంగోలు: ఎయిర్‌పోర్ట్ పనులు ప్రారంభించాలని వినతి

image

సీఎం చంద్రబాబును ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారు. ప్రకాశం జిల్లాలో అభివృద్ధి పనులపై చర్చించారు. ఒంగోలు సమీపంలో ఎయిర్‌పోర్ట్ పనులు త్వరగా మొదలయ్యేలా చూడాలని కోరారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 39 రోడ్ల పునర్నిర్మాణానికి రూ.135 కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. ఒంగోలులో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంపైనా సీఎంతో మాట్లాడారు. సీఎం సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.

News October 10, 2025

ఒంగోలు: నేటి నుంచి NTR వైద్య సేవలు బంద్‌

image

జిల్లాలోని ఆస్పత్రుల్లో NTR వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. జిల్లాలోని ఆస్పత్రులకు రూ.150 కోట్ల వరకు బిల్లులు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 120కిపైగా ప్రైవేటు ఆస్పత్రులు ఈ సేవలందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ వైద్యులు కొంతకాలంగా బకాయిల కోసం పోరాటం చేస్తున్నా ఫలితం లేదు. దీంతో శుక్రవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోనున్నాయి.‌

News October 9, 2025

జాగో.. జాగో అంటున్న ప్రకాశం పోలీస్!

image

జిల్లాలోని రహదారుల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు అధికం. డ్రైవర్ కాస్త ఏమరపాటుగా నిద్రలోకి జారితే చాలు.. జరిగే ప్రమాదాన్ని ఊహించలేం. అందుకే ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో జిల్లాలోని నేషనల్ హైవేలలో వాష్ అండ్ గో కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. గత నెలకు సంబంధించి 2200 మంది లారీ డ్రైవర్లకు వాష్ అండ్ గో కార్యక్రమం ద్వారా మేలుకొలిపినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం గురువారం ప్రకటించింది.