News August 19, 2025

ప్రకాశం: 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు 214 అర్జీలు

image

ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తరచూ 1100 టోల్ ఫ్రీ నంబర్‌పై విస్తృత ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజు 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు 214 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ కార్యాలయం ప్రకటించింది. సుదూర ప్రాంతాల నుంచి కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి రాలేనివారు, ఈ నంబర్‌కు తమ సమస్యను తెలిపితే వారి సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు.

Similar News

News August 19, 2025

ఉపరాష్ట్రపతి అభ్యర్థి బరిలోకి మార్కాపురం వాసి.!

image

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతకుంటకు చెందిన డాక్టర్ మందటి తిరుపతిరెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా ఆయన సమర్పించిన నామినేషన్‌కు ఆమోదం సైతం లభించింది. సుప్రీంకోర్టు న్యాయవాదిగా గుర్తింపు పొందిన తిరుపతిరెడ్డి 2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎన్నికలు జరుగుతుండగా మరోమారు నామినేషన్ వేశారు.

News August 19, 2025

నోరు మెదపని అధికారులు: ప్రకాశం కలెక్టర్ సీరియస్

image

సరైన సమాచారం లేకుండా వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకావడంపై పలువురు కమిషనర్లు, MPDOల తీరుపై జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ పలు శాఖలు చేపడుతున్న పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రశ్నలకు పలువురు అధికారులు తెల్లముఖం పెట్టడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

News August 19, 2025

దివ్యాంగ విద్యార్థులకు DEO సూచన

image

ప్రకాశం జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులకు DEO కిరణ్ కుమార్ కీలక సూచన చేశారు. ఒంగోలులోని డీఈవో కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన విడుదలైంది. 18న సంతనూతలపాడు, 19న వైపాలెం, 20న దర్శి, 21న ఒంగోలు, 22 కొండేపి, 23 మార్కాపురం, 25 గిద్దలూరు, 26న కనిగిరిలో దివ్యాంగ విద్యార్థుల కోసం ఆయా తేదీల్లో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరాల్లో పాల్గొన్నవారికి సంబంధించిన యంత్రాలను అందిస్తామని తెలిపారు.