News June 29, 2024

ప్రకాశం: TDP ఎంపీ, YCP ఎమ్మెల్యే ఒకే వేదికపై

image

జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పక్కపక్కనే కూర్చుని, ఆత్మీయంగా పలకరించుకున్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెందినవారైనప్పటికీ పక్కపక్కనే కూర్చుని ఆత్మీయంగా పలకరించుకోవడంతో సమావేశం సజావుగా సాగిందని అధికారులు తెలిపారు.

Similar News

News September 21, 2024

ప్రకాశం: సీఎం చంద్రబాబుకు 53 వినతి పత్రాలు

image

నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం’జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న చంద్రబాబు ప్రజల నుంచి 53 వినతి పత్రాలు స్వీకరించారని సంబంధిత అధికారి శ్రీనివాసులు తెలియజేశారు. రెవిన్యూ సమస్యలపై 11, పెన్షన్ మంజూరుకు 8, వివిధ ప్రభుత్వ పథకాలు, ఆరోగ్యసమస్యలపై 4, రోడ్లు అభివృద్ధి చేయాలని 12, ఇళ్ల మంజూరుకు 4, ఉద్యోగాల కోసం 11, విద్యుత్ సమస్యలపై 2 వినతులు వచ్చాయన్నారు.

News September 21, 2024

పర్చూరు: ‘జాగ్రత్తగా లేకుంటే మరో బుడమేరు ప్రమాదం’

image

ఉప్పుటూరు గ్రామానికి పక్కనే ఉన్న వాగు వెంబడి కట్టలు తెగి ఉండడం పట్ల గ్రామస్థులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. గతంలో వచ్చిన తుఫాను కారణంగా కట్టలు తెగాయని అవి బాగుచేయకుంటే మరో బుడమేరు ప్రమాదాన్ని పర్చూరులో చూడాలని గ్రామస్థులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి కట్టలను బాగుచేయాలని వాగువెంబడే అనుకొని ఉన్న ఉప్పుటూరు, వీరన్నపాలెం గ్రామవాసులు కోరుతున్నారు.

News September 21, 2024

బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కరణం వెంకటేష్?

image

బాపట్ల జిల్లా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతల సమావేశం అధినేత జగన్ సమక్షంలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా చీరాల ఇన్ ఛార్జ్ కరణం వెంకటేష్‌ను నియమించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.