News March 5, 2025
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్ చేతన్

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని సాయి ఆరామంలో ప్రభుత్వం-ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయంపై ఉద్యానవన, సెరీకల్చర్, వెలుగు శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. రైతు సేవ కేంద్రాలు, మహిళా సంఘాల ద్వారా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
Similar News
News February 28, 2026
కాకినాడ పేలుడు ఘటన.. హోంమంత్రికి సీఎం ఆదేశం

AP: కాకినాడ జిల్లాలో జరిగిన పేలుడు ఘటనాస్థలానికి వెళ్లాలని హోంమంత్రి అనితను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన తక్షణ సాయం చేపట్టాలని జిల్లా ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు. మరోవైపు పేలుడు ధాటికి 18 మంది సజీవ దహనం కాగా వారిలో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.
News February 28, 2026
ప్రొద్దుటూరు అవినీతి అధికారుల గుండెల్లో గుబులు.!

ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంకు అవినీతిపై పూర్వక మేనేజర్ ప్రవీణ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఇతర శాఖల్లోని ఇంటి దొంగలు ఆందోళన చెందుతున్నారు. వీరిపై స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు మొదట పెట్రోల్ బంక్ అవినీతిపై కేసు నమోదయింది. మున్సిపల్, హౌసింగ్, హౌస్ బిల్డింగ్ సొసైటీ, శివాలయంలో అవినీతిపై కేసుల నమోదుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.
News February 28, 2026
కర్నూలు: ‘ఈ ఏడాదికి 45 లక్షల మొక్కలు నాటాలి’

కర్నూలు కలెక్టరేట్లో శనివారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే Plantation గురించి జిల్లా కలెక్టర్ సిరి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని, అందుకుగాను 45 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.


