News March 30, 2025
ప్రజలందరికీ జీవితాల్లో ఉగాది వెలుగులు నింపాలి: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రజలందరి జీవితాల్లో ఉగాది వెలుగులు నింపాలని కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. విశ్వావసు నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలని కలెక్టర్ కోరారు.
Similar News
News September 19, 2025
22 నుంచి జూబ్లీహిల్స్ పెద్దమ్మకు పల్లకి, పవళింపు సేవ

దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో 22 నుంచి అక్టోబర్ 2 వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయంలో ఏర్పాటు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు ఉ.3 గంటలకు పెద్దమ్మ తల్లికి అభిషేకం చేస్తారు. ప్రతిరోజు రాత్రి అమ్మవారి ఉత్సవమూర్తి పల్లకి సేవ ఊరేగింపు, పవళింపు సేవ చేయనున్నారు.
News September 19, 2025
దుర్గ గుడి ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు ఈ సమయంలో కరెక్టేనా..?

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో కొత్తగా ట్రస్ట్ బోర్డు ఛైర్మన్, సభ్యుల నియామకం, ఆలయ అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. వీరి మధ్య సమన్వయం లోపిస్తే భక్తులకు ఇబ్బందులు తప్పవని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమ్మవారి దర్శనాలు, ఉత్సవాల నిర్వహణపై ఇరువురు ఎలా సమన్వయం చేసుకుంటారో చూడాలి.
News September 19, 2025
KNR: NOV నుంచి అంగన్వాడీ పిల్లలకు ‘బ్రేక్ ఫాస్ట్’

అంగన్వాడీల చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ స్కీం అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. NOV 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి నుంచి ఈ ప్రోగ్రాంను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై ఇప్పటికే మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలందాయి. కాగా, ఉమ్మడి KNRలో 3,135 అంగన్వాడీలు ఉండగా, 74,550 మంది చిన్నారులు చదువుతున్నారు. మరోవైపు చిన్నారులకు, సిబ్బందికి 2జతల చొప్పున యూనిఫాంలను ప్రభుత్వం ఇవ్వనుంది.