News April 11, 2025

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం: MP కావ్య

image

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. కనకదుర్గ కాలనీలోని తమ క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు, అభిమానులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కేక్‌ను ఎంపీ కడియం కావ్య కట్ చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

Similar News

News February 23, 2026

ఘట్‌కేసర్‌: సైబర్ మోసం.. కూలీ ఖాతా ఖాళీ!

image

కూలి చేసుకుంటూ పూటగడిపే వారి ఖాతాలపై కూడా కన్నేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. యాదాద్రి-భువనగిరి జిల్లా రాజపేట మండలం బొందుగుల్లకు చెందిన బోదాసు విష్ణు (38) ఘట్‌కేసర్‌లోని తన సోదరి ఇంటికి వచ్చాడు. ఈ నెల 12న అతడి SBI ఖాతా నుంచి 3 విడతల్లో మొత్తం రూ.41,799 డెబిట్ అయ్యాయి. సైబర్ కేటుగాళ్ల చేతివాటమే అనుకుని, 1930కు ఫిర్యాదు చేయగా రూ.800 హోల్డ్‌లో పెట్టారు. ఘట్‌కేసర్ PSలో కంప్లైంట్ చేయడంతో కేసు నమోదైంది.

News February 23, 2026

చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 23)

image

1455- గూటెన్‌బర్గ్ తొలి బైబిల్ ముద్రణ పూర్తి
1876- ప్రముఖ సంఘ సంస్కర్త గాడ్గే మహరాజ్ జననం
1893- డీజిల్ ఇంజిన్‌కు పేటెంట్
1913- ప్రముఖ ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్ జననం
1954- పోలియో వ్యాక్సిన్‌ మొదటిసారిగా పిల్లలపై ప్రయోగం
1957- దివంగత మాజీ మంత్రి ఎర్రన్నాయుడు జననం
1969- అలనాటి హీరోయిన్ మధుబాల మరణం (ఫొటోలో)
* World Understanding and Peace Day

News February 23, 2026

సదాశివపేటలో యువకుడిపై కర్రతో దాడి

image

సదాశివపేట మండలంలోని కోల్కూర్ గ్రామంలో ఆదివారం రాత్రి ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ రక్తపాతానికి దారితీసింది. 10 గంటల సమయంలో చాకలి వీరేశం, రంజిత్ మధ్య మాట మాట పెరిగి వివాదం చెలరేగింది. ఈ క్రమంలో రంజిత్ కర్రతో దాడి చేయడంతో వీరేశం తలకు బలమైన గాయమైంది. 108 సిబ్బంది బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.