News October 7, 2025
ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి: నిరంజన్ రెడ్డి

బీసీల రిజర్వేషన్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తిలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అలవికాని, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News October 7, 2025
వరంగల్లో బాకీ కార్ట్ vs డోఖా కార్డ్

ఉమ్మడి వరంగల్లో పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందంటూ ‘కాంగ్రెస్ బాకీ కార్డు’లను BRS రిలీజ్ చేస్తే.. గత పదేళ్లలో BRS నాయకులు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని ‘BRS కా డోఖా కార్డు’ను కాంగ్రెస్ నాయకులు విడుదల చేశారు. వరంగల్ను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని BRSను కాంగ్రెస్ విమర్శిస్తే, అధికారం కోసం అమలు కాని హామీలిచ్చిందని కాంగ్రెస్ను BRS నాయకులు విమర్శిస్తున్నారు. మీ కామెంట్.
News October 7, 2025
జిల్లాలోనే అధిక పరిపాలనా విభాగాలు పర్చూరులోనే..!

పర్చూరు నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ప్రత్యేకస్థానం సంపాదించింది. సాధారణంగా నియోజకవర్గానికి ఒక్కో ఉన్నతాధికారి ఉండడం సాధారణం. కానీ పర్చూరులో ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ నియోజకవర్గంలో 6 మండలాలు ఉండగా, వీటి పరిపాలనకు ఇద్దరు DSPలు, ముగ్గురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు RDOలు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. దీంతో పర్చూరు నియోజకవర్గం బాపట్ల జిల్లాలోనే అత్యధిక పరిపాలన వ్యవస్థగా ఉందని ప్రజలు అంటున్నారు.
News October 7, 2025
యాడికి: పోక్సో కేసులో నిందితుడికి రిమాండ్

పోక్సో కేసులో యువకుడికి రిమాండ్ విధించిన ఘటన యాడికిలో చోటు చేసుకుంది. సీఐ వీరన్న వివరాల మేరకు.. మండలానికి చెందిన ఓ బాలికపై బత్తుల కృష్ణారెడ్డి గత శనివారం అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడు వేములపాడు సమీపంలో ఉండగా సోమవారం అరెస్ట్ చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్కు ఆదేశించారు.