News August 14, 2025

ప్రజలు ఇచ్చిన తీర్పు జగన్‌కి చెంపపెట్టు: దేవినేని ఉమా

image

ప్రజాస్వామ్య పద్ధతిలో పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు ఇచ్చిన తీర్పు జగన్ రెడ్డికి చెంపపెట్టు అని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. గొల్లపూడిలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్సవంకు ఒకరోజు ముందు పులివెందుల ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. జగన్ రెడ్డి చేసిన పాపాలే అతనికి శాపాలు అయ్యాయన్నారు. వై నాట్ కుప్పం అన్న జగన్ నేడు పులివెందుల ప్రజల తీర్పు పై ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు.

Similar News

News August 15, 2025

గోదావరి నదిని పరిశీలించిన కలెక్టర్

image

ఇబ్రహీంపట్నం మం. ఎర్దండి గ్రామ శివారులోని గోదావరి నదిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు. గతేడాది గోదావరి నది వరదతో ఉప్పొంగినప్పుడు తీసుకున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే భారీవర్షాల నేపథ్యంలో నదిలో వరద ఉప్పొంగితే తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి RDO శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News August 15, 2025

మంత్రి పొంగులేటితో ఇన్‌ఛార్జి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

image

భారీ వర్షాలు సహాయక చర్యల నిర్వహణపై మంత్రి పొంగులేటి గురువారం కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని మొదటి అంతస్తులో అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్ (రెవెన్యూ) తో పాటు టొప్పో పాల్గొన్నారు. జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రికి టొప్పో వివరించారు.

News August 15, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తీరంగా ర్యాలీలు
> రేపు జనగామకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
> స్వతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
> కలెక్టర్ ను కలిసిన శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహీత
> జఫర్గడ్ పాక్స్ & డీసీసీబీ పాలకవర్గాల గడువు పొడగింపు
> పులివెందులలో జడ్పీటీసీ అభ్యర్థి గెలుపు పాలకుర్తిలో సంబరాలు
> రఘునాథపల్లిలో పర్యటించిన కలెక్టర్