News July 5, 2024
ప్రజల్లో చైతన్యం నింపడంలో కవులు, రచయితలు ముందుండాలి: KCR
తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపడంలో కవులు రచయితలు ముందుండాలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, MLC గోరేటి వెంకన్న ఎర్రవెల్లి ఫాంహౌజ్లో కేసీఆర్తో భేటీ అయ్యారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నదీ జలాల వాటాను సాధించుకోవడంలో ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థంతో పాటు, తెలంగాణ నాయకత్వం అనుసరించిన నిర్లక్ష్య ధోరణి సోయిలేని తనం ప్రధాన కారణాలన్నారు.
Similar News
News July 8, 2024
MDK: ఒంటరితనం భరించలేక యువతి ఆత్మహత్య
ఒంటరితనం భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD పటాన్చెరు అమీన్పూర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మాధవపురి హిల్స్ కాలనీలో ఉంటున్న రీనా(30)భర్తతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని వర్క్ ఫ్రం హోం డ్యూటీ చేసుకుంటూ తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో మానసిక ఒత్తిడి తగ్గేందుకు ఉపయోగిస్తున్న 130 మాత్రలను ఒకేసారి మింగి ఆమె ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
News July 8, 2024
ఉమ్మడి మెదక్ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నేడు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి 3 రోజులు ఆయా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే గత రెండు రోజులుగా వర్షాలు పడడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు
News July 8, 2024
ఉమ్మడి మెదక్ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నేడు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి 3 రోజులు ఆయా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే గత రెండు రోజులుగా వర్షాలు పడడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు