News January 16, 2026
ప్రజల్లో మమేకమై పనిచేయాలి: ఎంపీ రఘునందన్

బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో మమేకమై పని చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. శుక్రవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో సిద్దిపేట నాయకుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. MP మాట్లాడుతూ ప్రజలకు చేరువయ్యేలా సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు తొడుపునూరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 22, 2026
HYD సరిహద్దులు ఫిక్స్!

HYD మ్యాప్ అధికారికంగా మారిపోయింది. ORR దాటి RRR వరకు అథారిటీ పరిధి విస్తరించింది. 104 మండలాల్లోని 1,355 గ్రామాలు ఇప్పుడు ఈ పరిధిలోకి వచ్చాయి. RRRకి ఇరువైపులా 2 కి.మీ మేర ‘డెవలప్మెంట్ బఫర్’ జోన్ అమల్లోకి వచ్చింది. ఇకపై ఇక్కడ గ్రామ పంచాయతీ లేఅవుట్లకు అనుమతి ఉండదు. మొత్తం 10,472 చ.కి.మీ పరిధిలో కఠినమైన HMDA నిబంధనలు అమలు కాబోతున్నాయి. రియల్ ఎస్టేట్ ముఖచిత్రాన్ని మార్చే చట్టబద్ధమైన మార్పు ఇది.
News February 22, 2026
HYD సరిహద్దులు ఫిక్స్!

HYD మ్యాప్ అధికారికంగా మారిపోయింది. ORR దాటి RRR వరకు అథారిటీ పరిధి విస్తరించింది. 104 మండలాల్లోని 1,355 గ్రామాలు ఇప్పుడు ఈ పరిధిలోకి వచ్చాయి. RRRకి ఇరువైపులా 2 కి.మీ మేర ‘డెవలప్మెంట్ బఫర్’ జోన్ అమల్లోకి వచ్చింది. ఇకపై ఇక్కడ గ్రామ పంచాయతీ లేఅవుట్లకు అనుమతి ఉండదు. మొత్తం 10,472 చ.కి.మీ పరిధిలో కఠినమైన HMDA నిబంధనలు అమలు కాబోతున్నాయి. రియల్ ఎస్టేట్ ముఖచిత్రాన్ని మార్చే చట్టబద్ధమైన మార్పు ఇది.
News February 22, 2026
రేపు స్టాక్ మార్కెట్లపై వీటి ప్రభావం?

US-ఇరాన్ టెన్షన్స్, అమెరికా సుప్రీంకోర్టు టారిఫ్స్ రద్దు ప్రభావం రేపు దేశీయ స్టాక్ మార్కెట్లపై ఉండొచ్చని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. US సుప్రీంకోర్టు తీర్పు, వెస్ట్ మార్కెట్లు శుక్రవారం పాజిటివ్గా క్లోజ్ అవడం సానుకూలంగా ఉంది. అయితే ఈనెల 24 నుంచి 15% టారిఫ్స్ అమలు కానున్నట్లు ట్రంప్ ప్రకటించడం, ముడి చమురు ధరలు పెరగడం, దేశీయ-విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, రూపీ పతనం ప్రతికూల అంశాలుగా ఉన్నాయి.


