News June 13, 2024
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు: మంత్రి బీసీ

ఉమ్మడి జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతానని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ‘ఉన్నతాధికారులతో సమావేశమై ఏ ప్రాజెక్టులను ముందుగా చేపడితే మంచిదన్న అంశాలను సమీక్షిస్తా. ఏ ప్రాజెక్టులతో ఎక్కువ మందికి ప్రయోజనం?, ఏవి వేగంగా పూర్తవుతాయి, జిల్లాకు మేలు చేసే ప్రాజెక్టులు ఏమిటి? పెండింగ్లోని ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి? తదితర విషయాలను విశ్లేషించి నిర్ణయం తీసుకుంటా’ అన్నారు.
Similar News
News October 3, 2025
దేవరగట్టులో మూడుకు చేరిన మృతుల సంఖ్య!

దేవరగట్టు కర్రల సమరంలో జరిగిన హింసలో మరొకరు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఆలూరు మండలం అరికెరకు చెందిన తిమ్మప్ప, ఆలూరుకు చెందిన నాగరాజుగా గుర్తించారు. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. 2 లక్షలకు పైగా భక్తలు పాల్గొన్న ఈ ఉత్సవంలో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు సందర్భంగా ఉత్సవమూర్తుల కోసం కర్రలతో 3 గ్రామాల ప్రజలు ఒకవైపు, 11 గ్రామాల ప్రజలు మరోవైపు ఉండి కొట్టుకుంటారు.
News October 2, 2025
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి: కలెక్టర్

జాతిపిత మహాత్మా గాంధీ సూచించిన అహింస, శాంతి మార్గాలను ఎంచుకొని ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని కలెక్టర్ సిరి పేర్కొన్నారు. గురువారం పంచలింగాలలోని జిల్లా జైలులో ఖైదీల దినోత్సవం నిర్వహించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని జైలు ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి పాల్గొన్నారు.
News October 2, 2025
మహాత్మా గాంధీ స్ఫూర్తితో యువతరం రాణించాలి: కలెక్టర్

మహాత్మా గాంధీ స్ఫూర్తితో నేటి యువతరం అన్ని రంగాల్లో రాణించి దేశాభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కర్నూలులోని కలెక్టరేట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి కేఎంసీ కమిషనర్ విశ్వనాథ్తో
కలిసి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన కృషి వెలకట్టలేనిది కొనియాడారు.