News October 21, 2024

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన: మహేశ్ కుమార్

image

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని TPCC అధ్యక్షుడు, MLC మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం నిజామాబాద్ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో పయనింపజేయడానికి పార్టీలకు అతీతంగా పని చేద్దామని పిలుపునిచ్చారు.

Similar News

News December 15, 2025

నిజామాబాద్: నేటితో ముగియనున్న 3వ విడత ఎన్నికల ప్రచారం

image

నిజామాబాద్ జిల్లాలో 3వ విడత ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5గంటలకు ముగియనుంది. ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీమ్‌గల్, డొంకేశ్వర్, కమ్మర్‌పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల్లో 17న ఎన్నికలు జరగనున్నాయి.165 సర్పంచ్ స్థానాల్లో 19 ఏకగ్రీవం కాగా 146 సర్పంచ్, 1,620 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తంగా 3,26,029 మంది ఓటర్లు ఉన్నారు.

News December 15, 2025

నిజామాబాద్: నెలాఖరులోగా లైఫ్ సర్టిఫికెట్లు అందించాలి

image

ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న ఉద్యోగులు, కార్మికులు లైఫ్ సర్టిఫికెట్‌లు ఇప్పటి వరకు అందజేయని వారు ఈ నెలాఖరు వరకు మీసేవ కేంద్రాల్లో సమర్పించాలని ప్రాంతీయ భవిష్య నిధి కార్యాలయ సిబ్బంది తెలిపారు. లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించకపోతే పెన్షన్లు ఆగిపోతాయన్నారు. పెన్షన్ పొందుతున్న బీడీ కార్మికులు, ఇతర కార్మికులు, ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్లను అందజేయాలన్నారు.

News December 15, 2025

NZB: రాత్రి వరకు కొనసాగిన GP ఎన్నికల కౌంటింగ్

image

నిజామాబాద్ జిల్లాలోని 8 మండలాల్లో ఆదివారం జరిగిన GP ఎన్నికల కౌంటింగ్ కొన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో రాత్రి వరకు కొనసాగింది. చిన్న GPల్లో సాయంత్రం సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కాగా 158 సర్పంచ్ స్థానాలకు 568 మంది, 1,081 వార్డులకు 2,634 మంది పోటీలో నిలవగా మొత్తం 2,38,838 మంది ఓటర్లకు గాను 1,83,219 మంది (76.71 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు.