News March 29, 2024

ప్రజల ఆస్తులు కబ్జా: చంద్రబాబు

image

వైసీపీ నేతలు ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారని.. ఎదురుతిరిగిన వారిపై కేసులు పెట్టి జైలులో పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కావలిలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు. కృష్ణపట్నం పోర్టు ఏమైందో ప్రజలు చూశారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను తరిమికొట్టారు. న్యాయం చేయాలని కోరిన చెల్లెలపైనే కేసులు పెట్టారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News December 17, 2025

నెల్లూరు: ప్రాణాలు పోతున్నా.. చలించరా..?

image

ప్రాణాపాయం కేసులను ఒకవేళ అడ్మిట్ చేసుకుంటే చికిత్సలో ప్రాణాలు పోతే తమపైకి వస్తుందేమోననే నెపంతో వైద్యులు రిస్క్ తీసుకోకుండా రెఫర్ చేస్తున్నారు. ఆసుపత్రుల్లో వసతులు, వైద్యుల కొరత ఉండడంతో GGHకి రెఫర్ చేస్తున్నారు. జిల్లాలో 108 ద్వారా వచ్చిన అత్యవసర కేసులు పరిశీలిస్తే Sep (3063),OCT(3340), NOV(3024), DEC(559) రాగా.. వీటిల్లో SEP(496), OCT(573), NOV(662), DEC(157) కేసులను వేరే ఆసుపత్రులకు రెఫర్ చేశారు.

News December 17, 2025

గోవా నుంచి తిరుపతికి.. అక్కడ నుంచి నెల్లూరుకి..

image

నెల్లూరు కార్పొరేషన్‌కి చెందిన 40 మంది కార్పొరేటర్లు కుటుంబ సభ్యులతో గోవాలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. వారు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు గోవా నుంచి తిరుపతికి రానున్నారు. అక్కడి నుంచి రేపు ఉదయం నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుంటారు. రేపు కార్పొరేషన్ ఆఫీస్‌లో సమావేశం ఉంటుంది. ఇన్‌ఛార్జ్ మేయర్‌ రూప్‌ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మేయర్ రాజీనామాకు ఆమోదం తెలపనున్నారు.

News December 17, 2025

లింగసముద్రం: గుండెపోటుతో హోంగార్డు మృతి

image

లింగసముద్రం పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న కొండలరావు గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం రాత్రి బైక్‌పై విధి నిర్వహణకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.