News February 11, 2026
ప్రజల భద్రత మరింత పటిష్ఠం

కర్నూలు జిల్లాలో ప్రవేశపెట్టిన డ్రోన్ పెట్రోలింగ్ ద్వారా ప్రజల భద్రత మరింత పటిష్ఠం కానుంది. డే, నైట్ విజన్ సౌకర్యాలు కలిగిన డ్రోన్ కెమెరాలతో పగలు, రాత్రి నిరంతరం నిఘా పెట్టనున్నారు. దీంతో నేరాలు ముందే గుర్తించి అరికట్టే అవకాశం ఉంటుంది. మహిళల భద్రతకు నియంత్రణ, కాలేజీలు, పాఠశాలల వద్ద ఈవ్ టీజింగ్కు పాల్పడేవారిని గుర్తించే అధునాతన సాంకేతికను జోడించారు. దీంతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టనుంది.
Similar News
News February 19, 2026
హౌసింగ్ సమస్యలపై ‘ఫోన్-ఇన్’ కార్యక్రమం

కర్నూలు జిల్లాలో గృహ నిర్మాణ లబ్ధిదారుల సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు హౌసింగ్ పీడీ చిరంజీవి తెలిపారు. సిమెంట్, స్టీల్ సరఫరా, నిర్మాణ బిల్లులు మరియు PMAY 2.0 Urban ఇళ్లకు సంబంధించిన వివరాల కోసం ప్రతి గురువారం ఉదయం 10:00 నుంచి 11:00 గంటల వరకు సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
★ సంప్రదించాల్సిన నంబర్: 08518-257481
News February 18, 2026
బాల్య వివాహాలు జరగకుండా చూడాలి: కలెక్టర్

కల్లూరు మండలం బస్తిపాడులోని గ్రామ సచివాలయంలో కలెక్టర్ ఏ.సిరి మండల సమాఖ్య పొదుపు సంఘాలతో సమావేశం నిర్వహించారు. పొదుపు సంఘాల మహిళలతో ఆమె మాట్లాడారు. గ్రామంలో బాల్య వివాహాలు చేస్తున్నారనే సమాచారం వస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం చేరవేసి, వాటిని ఆపాలన్నారు. చదువురాని వారు అక్షరాంధ్రలో ఎన్రోల్మెంట్ అవ్వాలని, చదువు వస్తే గౌరవం వస్తుందని తెలిపారు.
News February 18, 2026
కర్నూలు: మెడికల్ విద్యార్థిని సూసైడ్

గూడూరు(M) పెంచికలపాడు సమీపంలోని విశ్వభారతి మెడికల్ కాలేజీ విద్యార్థిని సోనిక(22) సూసైడ్ చేసుకుంది. ప్రకాశం(D) తుర్లపాడుకు చెందిన రత్నమయ్య కుమార్తె సోనిక పారామెడికల్ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా ఆమె కొంతకాలంగా మనస్తాపంతో ఉండేది. ఈ క్రమంలో మంగళవారం హాస్టల్ రూములో ఉరేసుకుంది. ఈ ఘటనపై కె.నాగలాపురం ఎస్ఐ అఖిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


