News December 24, 2025
ప్రజల ముంగిటకే పోలీస్ సేవలు: ఈ ఏడాది 41,745 కాల్స్కు స్పందన..!

కామారెడ్డి జిల్లాలో ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో పోలీసులు ‘డైల్-100’ సేవలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 41,745 కాల్స్ రాగా, స్పందించి బాధితులకు అండగా నిలిచారు. వీటిలో తీవ్రతను బట్టి 253 కేసులు నమోదు చేయగా, మిగిలిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించారు. ప్రజలు ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో ‘డైల్-100’కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని SP రాజేష్ చంద్ర సూచించారు.
Similar News
News December 25, 2025
DGP ఎంపికపై కీలక ఆదేశాలు

TG: తాత్కాలిక పద్ధతిలో రాష్ట్ర DGPగా శివధర్ రెడ్డి నియామకం చెల్లదంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన నియామక ఉత్తర్వుల రద్దుకు నిరాకరించింది. అయితే DGP ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది. సీనియర్ ఐపీఎస్ల జాబితాను UPSCకి పంపించిన తర్వాత ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
News December 25, 2025
హైదరాబాద్లో డేంజర్ బెల్స్..

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున 240కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. తెల్లాపూర్ ఏరియాలో 422గా నమోదు కావటం గమనర్హం.
SHARE IT
News December 25, 2025
BNGR: పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన రెండు వారాలకే మృతి

బూర్గుపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మూడో వార్డు సభ్యుడిగా గెలుపొందిన చింతల చిన్న నర్సయ్య (60) అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. విజయం సాధించి రెండు వారాలు కూడా గడవకముందే ఆయన మృతి చెందడం గ్రామస్థులను కలచివేసింది. సర్పంచ్ చింతల సంపత్, పాలకవర్గ సభ్యులు ఆయన మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.


