News January 20, 2026
‘ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి’

ప్రజాసేవలో నాణ్యత పెరగాలని, జిల్లా అభివృద్ధికి శాఖల సమన్వయం కీలకమని సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. గ్రీవెన్స్ దరఖాస్తులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీపై బాధ్యతతో స్పందించి, వారిలో నమ్మకం కలిగేలా సమస్యలను పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News February 9, 2026
భద్రాద్రి: సాయంత్రం 5 గంటల తరువాత ష్.. గప్ చుప్

భద్రాద్రి జిల్లాలోని 2 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో గత కొద్దిరోజులుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. అభ్యర్థుల్లో గెలుపు గుర్రాలు ఎవరో తేల్చే సమయం ఆసన్నమవడంతో, ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. సాయంత్రం 5గంటలకు మైకులు మూతపడనుండటంతో, అభ్యర్థులు ‘రోడ్ షో’లు, ఇంటింటి ప్రచారాలతో మున్సిపాలిటీలను చుట్టేయనున్నారు.
News February 9, 2026
ఖమ్మం: సాయంత్రం 5 గంటల తరువాత ష్.. గప్ చుప్

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో గత కొద్దిరోజులుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. అభ్యర్థుల్లో గెలుపు గుర్రాలు ఎవరో తేల్చే సమయం ఆసన్నమవడంతో, ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. సాయంత్రం 5 గంటలకు మైకులు మూతపడనుండటంతో, అభ్యర్థులు ‘రోడ్ షో’లు, ఇంటింటి ప్రచారంతో మున్సిపాలిటీలను చుట్టేయనున్నారు. బుధవారం పోలింగ్ జరగనుంది.
News February 9, 2026
KNR: నేటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సాగుతున్న ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నెల 11న జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్కు 48గంటల ముందు ప్రచారం నిలిపివేయనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత బహిరంగ సభలు, ప్రచార వాహనాలు పూర్తిగా నిషేధించబడతాయి. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా వైన్ షాపులు కూడా పోలింగ్ ముగిసే వరకు మూసివేయనున్నారు. ఇక పట్టణ భవిష్యత్తును ఓటర్లు 11న తేల్చనున్నారు.


