News March 17, 2025
ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలి: అడిషనల్ కలెక్టర్లు

మహబూబాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, వీరబ్రహ్మచారి వినతులు స్వీకరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకాలలోనైన లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 17, 2025
పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు అనుమతి

పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. 2 కాంప్లిమెంటరీ స్టాళ్ల ఏర్పాటుకు లోక్సభ సచివాలయం అనుమతి ఇచ్చింది. సంగం, నలంద లైబ్రరీ వద్ద వాటిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు AP MP కలిశెట్టికి లోక్సభ డిప్యూటీ కార్యదర్శి అజిత్ లేఖ రాశారు. అరకు కాఫీకి ప్రచారం కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు TDP ఎంపీలు గతంలో లోక్సభ స్పీకర్ను కోరగా తాజాగా అనుమతి లభించింది.
News March 17, 2025
రాష్ట్రపతి అల్పాహార విందులో బైరెడ్డి శబరి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆతిథ్యంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతికి నమస్కారం చేశారు. రాష్ట్రపతి ఆహ్వానాన్ని ఎంతో గౌరవంగా, స్ఫూర్తిదాయకంగా భావిస్తున్నాని శబరి తెలిపారు.
News March 17, 2025
బాపట్ల జిల్లా TO DAY TOP HEADLINES

★బాపట్ల జిల్లా వ్యాప్తంగా 234 మంది విద్యార్థులు గైర్హాజరు★పిట్టలవానిపాలెం: సైనికుడి కుటుంబానికి 1.25 లక్షల సాయం★భట్టిప్రోలు: చేనేతకు రూ.2 వేల కోట్లు కేటాయించాలి★బాపట్ల: ఎన్టీఆర్ సేవా మిత్రల నిరసన★బాపట్ల: సారా నిర్మూలనకు నవోదయం 2.0 ప్రారంభం★బాపట్ల: వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నిరసన★పర్చూరు: Way2Newsతో టెన్త్ విద్యార్థులు★బాపట్ల: రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య