News September 1, 2025

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: అదనపు కలెక్టర్లు

image

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. విద్యార్థిని సీటు, రహదారి సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, వెలుగుమట్ల చెరువు ఆక్రమణ వంటి సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News September 2, 2025

వరదల నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి

image

భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం, పునరావాస చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విపత్తు నిర్వహణ నిధుల వినియోగంపై పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను సిద్ధం చేసి, వెంటనే యూసీలను సమర్పించాలని ఆదేశించారు. వరదల కారణంగా దెబ్బతిన్న కాల్వలు, చెరువులు, రోడ్ల మరమ్మతులకు సంబంధించి యుద్ధప్రాతిపదికన యాక్షన్ ప్లాన్‌ను రూపొందించాలని సీఎం సూచించారు.

News September 2, 2025

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఖమ్మం విద్యార్ధి

image

ప్రతిభకు వయస్సు అడ్డుకాదని ఖమ్మం జిల్లాకు చెందిన బచ్చుపల్లి ఇషాన్ నిరూపించాడు. కళ్లకు గంతలు కట్టుకుని వరుసగా 16 దేశభక్తి గీతాలను పియానోపై వాయించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు. చిన్న వయస్సులోనే సాధనతో ఈ రికార్డును సాధించిన ఇషాన్, తన పాఠశాలకే కాకుండా ఖమ్మం జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు. ఇషాన్ ప్రతిభను చూసి పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు, స్థానికులు అభినందించారు.

News September 2, 2025

స్థానిక ఎన్నికలు.. ‘ఆమె’ కీలకం

image

గతనెల 28న ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల చేయగా 31 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 1042 క్లెయిమ్స్ వచ్చాయి. వీటిని పరిష్కరించి తుది జాబితాను నేడు విడుదల చేయనున్నారు. జిల్లాలో మొత్తం 8,02,690 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళలు 4,14,124, పురుషులు 3,88,224, ఇతరులు 22 మంది ఉన్నారు. పురుషుల కంటే 26,180 మంది మహిళలు అధికంగా ఉన్నారు. అభ్యర్థుల విజయంలో వీరే కీలకం కానున్నారు.