News November 17, 2025
ప్రజావాణి దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి: ములుగు కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర అధికారులకు ఆదేశించారు. అవసరమైతే క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. ములుగు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన గ్రీవెన్స్లో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 62 దరఖాస్తులు వచ్చాయి. ఆయా శాఖల అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలన్నారు. అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు ఉన్నారు.
Similar News
News November 17, 2025
గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో ప్రజావాణి

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ చాహత్ వాజ్పేయి పాల్గొన్నారు. ప్రజలు వివిధ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను కమిషనర్కు అందించారు. వినతుల స్వీకరించిన కమిషనర్ సంబంధిత శాఖల అధికారులను వెంటనే చర్యలు తీసుకుని, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.
News November 17, 2025
గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో ప్రజావాణి

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ చాహత్ వాజ్పేయి పాల్గొన్నారు. ప్రజలు వివిధ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను కమిషనర్కు అందించారు. వినతుల స్వీకరించిన కమిషనర్ సంబంధిత శాఖల అధికారులను వెంటనే చర్యలు తీసుకుని, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.
News November 17, 2025
సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం: మంత్రి టీజీ

పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. కర్నూలులోని జగన్నాథగుట్ట ఎన్టీఆర్ కాలనీలో సోమవారం 187 టిడ్కో గృహాలను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కర్నూలులో 10 వేల టిడ్కో ఇళ్ల పూర్తికి రూ.18 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. తొలి దశలో 187 గృహాలు అందించగా, మార్చి 31 నాటికి మొత్తం ఇళ్ల పనులు పూర్తిచేస్తామని ప్రకటించారు.


