News June 19, 2024

ప్రజావాణి నిర్వహించేందుకు ఏర్పాట్లు: కలెక్టర్

image

ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో ప్రజాదర్బార్, జిల్లాల్లో ప్రజావాణికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా సోమవారం నుంచి (ఈనెల 24) మండలాల్లో ప్రజావాణి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందుకు జిల్లా స్థాయి అధికారులను మండలానికి ఒకరిని ప్రత్యేక అధికారులుగా వేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 12, 2025

NLG: ధాన్యం సేకరణపై కలెక్టర్‌ మార్గదర్శం

image

నవంబర్, డిసెంబర్ తొలి వారంలో పెద్దఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున, కొనుగోలు ప్రక్రియలో పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ ఇల్లా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆమె సంబంధిత శాఖల అధికారులు, తహశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులకు ఈ మేరకు స్పష్టమైన సూచనలు చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు.

News November 12, 2025

NLG: సన్నబియ్యంలో నూకలే అధికం: లబ్ధిదారులు

image

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో నూకలు ఎక్కువగా ఉంటున్నాయని జిల్లాలోని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. గత 2 నెలల నుంచి పంపిణీ చేస్తున్న బియ్యంలో 20% పైగా నూకలు ఉంటున్నాయని వారు తెలిపారు. జిల్లాలో మొత్తం 4,66,100 రేషన్ కార్డులు ఉండగా, ప్రతినెలా జిల్లా వ్యాప్తంగా 94.04 లక్షల క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నారు. మీకు కూడా ఇదే సమస్య పునరావృతం అవుతుందా? కామెంట్.

News November 11, 2025

నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

→ NLG: 13 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు
→ NLG: వే2న్యూస్ కథనానికి అధికారుల స్పందన
→ కేతేపల్లి: నార్కోటిక్స్ కట్టడిలో నల్గొండ పోలీస్ సంచలనం
→ NLG: వానాకాలం ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్
→ NLG: 4 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు అందని వేతనాలు
→ NLG: 50 శాతం సిలబస్ ఇంకా అలానే..
→ NLG: పంట పండింది.. సేకరణ ఇలా
→ MLG: రబ్బరులా ఇడ్లీ రవ్వ
→చిట్యాల : బస్సు దగ్ధం.. ప్రయాణికుల రియాక్షన్