News July 16, 2024

ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: కలెక్టర్

image

NLG: ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులను ఒకటికి రెండుసార్లు చదివి, ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News August 5, 2025

NLG: మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందే!

image

విధులకు హాజరు కాకుండానే హాజరయ్యామని ఫేక్ అటెండెన్స్ క్రియేట్ చేసిన పంచాయతీ కార్యదర్శులపై జిల్లా పంచాయతీరాజ్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ సృజన ఆదేశాల మేరకు జిల్లా పంచాయితీ అధికారి వెంకయ్య నోటీసులు జారీచేశారు. మొత్తం జిల్లాలో 69 మంది పంచాయితీ కార్యదర్శులతో పాటు 15 మంది మండల పంచాయతీ అధికారులకు నోటీసులు అందజేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

News August 5, 2025

NLG: డుమ్మా కొట్టడం కుదరదిక!

image

నల్గొండ జిల్లాలో వైద్యులు, సిబ్బంది డుమ్మాలకు అడ్డుకట్ట వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిని అమలు చేసేందుకు ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 34 పీహెచ్‌సీలు, 5 యూహెచ్‌సీలు, 257 సబ్‌ సెంటర్లు ఉన్నాయి. వీరందరికీ ముఖ హాజరుకు సంబంధించిన మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

News August 5, 2025

NLG: కొబ్బరి కొనలేం.. కొట్టలేం..!

image

పవిత్ర కార్యక్రమాలు, పూజలలో వినియోగించే కొబ్బరికాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో ఇళ్లలో, ఆలయాలలో కొబ్బరికాయల వినియోగం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఒక్క కొబ్బరికాయ ధర రూ.50కు పైగా పలుకుతోంది. ధర్వేశిపురం ఎల్లమ్మ ఆలయం వద్ద ఈవో అజమాయిషీ లేకపోవడంతో అధిక ధరలకు అమ్ముతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.