News October 9, 2024

ప్రజాస్వామ్యం బతకాలంటే ఒక పేపర్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారానే సాధ్యం: కేతిరెడ్డి

image

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి X వేదికగా మాజీ సీఎం జగన్ చేసిన పోస్టుకు స్పందించారు. మొదటగా మనం పోరాటం చేయాల్సింది ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపైనే అన్నారు. ఎందుకంటే ఏ ఎలక్ట్రానిక్ మిషన్లు నైనా ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుందన్నారు. మన భారత దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే అది ఒక పేపర్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారానే సాధ్యమన్నారు.

Similar News

News October 9, 2024

ఎస్‌కే యూనివర్సిటీ పరీక్ష ఫలితాల విడుదల

image

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో సెకండ్ సెమిస్టర్ UG రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రొఫెసర్ శోభలత కమిటీ సభ్యులు ఎస్కే ఛాంబర్‌లో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ వెంకటనాయుడు, రిజిస్టార్ రమేశ్ బాబు, పరీక్షల నియంత్రణ అధికారి లోకేశ్వర్, అసిస్టెంట్ రిజిస్టర్ శంకర్ పాల్గొన్నారు.

News October 9, 2024

‘ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోండి’

image

శ్రీ సత్య సాయి జిల్లాలో అర్హత కలిగిన బీసీ, ఈబీసీ, సంచార కులాలకు చెందిన విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి నిర్మల జ్యోతి పేర్కొన్నారు. 9, 10, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు పీఎం యశస్వి ఉపకార వేతనాలు పొందేందుకు ఈనెల 15వ తేదీ లోపు 9, 10 తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇంటర్ చదువుతున్న వారు 30 లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News October 9, 2024

పల్లెకు మంచి రోజులు

image

గ్రామాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె పండుగ’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 14 నుంచి 20 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధికి సంబంధించి ఆగస్టు 23న నిర్వహించిన గ్రామ సభలో ప్రతిపాదించిన పనులకు శ్రీకారం చుడతారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.4500 కోట్లు కేటాయిస్తోంది. కాగా అనంతపురం జిల్లాలో 577, శ్రీ సత్యసాయి జిల్లాలో 427 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.