News January 27, 2025
ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మండల, డివిజన్, మున్సిపల్ స్థాయిలో జరిగిన పీజీఆర్ఎస్ మినిట్స్ సీఎంవో పీజీఆర్ఎస్ గ్రూపులో నోడల్ అధికారికి పోస్ట్ చేయాలన్నారు. రీ సర్వే గ్రామసభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేసి, నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించడంతో పాటు ఆడిట్ చేయాలన్నారు.
Similar News
News October 19, 2025
ములుగు: బాణసంచా షాపుల వద్ద ఇవి తప్పనిసరి!

దీపావళి సందర్భంగా జిల్లాలో బాణసంచా దుకాణాల వద్ద నిబంధనలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మండే స్వభావం కలిగిన వస్తువులు దుకాణాల వద్ద ఉంచొద్దని, ఒక్కో షాపుకు కనీసం 3 మీటర్ల దూరం తప్పనిసరిగా ఉండాలన్నారు. దుకాణాల వద్ద 4 ఫైర్ బకెట్లను ఏర్పాటు చేయాలన్నారు. రెండింటిని పొడి ఇసుక, మరో రెండింటిని నీటితో నింపాలన్నారు. బాణసంచా షాపుల వద్ద పొగ తాగడాన్ని నిషేధించాలన్నారు. ఫైర్ స్టేషన్ నంబర్ ఉండాలన్నారు.
News October 19, 2025
జగిత్యాల: 6 నెలలుగా రేషన్ డీలర్లకు అందని కమీషన్

రేషన్ డీలర్లకు ఆరు నెలలుగా వారికి రావలసిన కమీషన్ అందడం లేదు. జిల్లాలో 592 రేషన్ షాపులు ఉండగా.. మొత్తం 3,48,058 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందుకోసం దాదాపు 6500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. రేషన్ డీలర్లకు క్వింటాలు బియ్యానికి రూ.140 చొప్పున కమీషన్ ఇస్తుండగా, ఇందులో కేంద్రం రూ.90, రాష్ట్రం రూ.50 చెల్లిస్తోంది. అయితే గత మే నెల నుంచి డీలర్లకు రావాల్సిన కమీషన్ రావడం లేదు.
News October 19, 2025
మోదీ కర్నూలు పర్యటనలో భద్రతా లోపం!

AP: ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనలో భద్రతా లోపం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెలిప్యాడ్ వద్ద ప్రధానికి వీడ్కోలు పలికే సమయంలో పాస్ల జాబితాలో లేని ఇద్దరు వ్యక్తులు భద్రతా వలయంలోకి ప్రవేశించినట్లు సమాచారం. వీఐపీ పాస్లు తీసుకుని బీజేపీ నేతల పేర్లతో ట్యాంపర్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత భారీ భద్రత ఉన్నా ఇలా జరగడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.