News March 18, 2025
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: కమిషనర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి వహించారని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకొని కౌన్సిల్ హాల్లో ప్రజల నుంచి వినుతులు స్వీకరించారు. స్వీకరించిన ఫిర్యాదులలో ఎక్కువగా టౌన్ ప్లానింగ్ 46, ఇంజినీరింగ్ విభాగం నుంచి 24 ఫిర్యాదులు రాగా.. హెల్త్ శానిటేషన్ 4, ప్రాపర్టీ టాక్స్ 10, మంచినీటి సరఫరా 4.. మొత్తం 88 అప్లికేషన్లు వచ్చాయి.
Similar News
News March 18, 2025
మహేశ్ బాబు ఔదార్యం.. ఫ్రీగా 4500 హార్ట్ ఆపరేషన్స్!

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు సూపర్ స్టార్ మహేశ్బాబు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సంఖ్య నిన్నటితో 4500+కు చేరినట్లు ఆంధ్రా హాస్పిటల్స్ ప్రకటించింది. ఏపీలో మదర్స్ మిల్క్ బ్యాంక్తో పాటు బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాను అందించే కార్యక్రమాన్ని నమ్రతా ప్రారంభించారు. మహేశ్బాబు ఫౌండేషన్ పిల్లల హార్ట్ ఆపరేషన్లను కొనసాగిస్తుందని ఆమె తెలిపారు.
News March 18, 2025
కోదాడ: చోరీకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు

చర్చిలో దొంగతనానికి వెళ్లి ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. కోదాడ సీఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబేడ్కర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఒక చర్చిలోకి అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. నిర్మాణం కోసం తీసుకొచ్చిన కొత్త కిటికీలు, డోర్ను దొంగిలించేందుకు ప్రయత్నించగా కాపలా వ్యక్తులు గమనించి కేకలు వేశారు. పారిపోయే క్రమంలో రాళ్లపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.
News March 18, 2025
MNCL: 21, 22వ తేదీల్లో ఇంటర్వ్యూలు

మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో క్యాజువాలిటీ మెడికల్ అధికారి పోస్టులను ఒప్పంద పద్ధతిన భర్తీ చేసేందుకు ఈ నెల 21, 22వ తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎండి సులేమాన్ తెలిపారు. ఐదు క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులలో సీఎంవో, ఆర్ఎంవో పోస్టులకు ఎంబీబీఎస్ విద్యార్హత కలిగిన వారికి ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు.