News February 24, 2025

ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తాం: వైఎస్ జగన్

image

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీస్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. జగన్ మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని, టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలిపోయాయని అన్నారు.

Similar News

News February 24, 2025

పోలింగ్ కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

image

ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జడ్పీలో భద్రపర్చిన పోలింగ్ కిట్లను రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ నాగలక్ష్మీ సోమవారం పరిశీలించారు. మెటీరియల్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్సుల సీరియల్ నెంబర్లు వేసి వాటిని పోలింగ్ స్టేషన్ల వారీగా సిద్దం చేయాలని చెప్పారు. 26 నుంచి ఏసీ కళాశాలలో కిట్ల పంపిణీ కోసం ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని చెప్పారు.

News February 24, 2025

3 పతకాలతో సత్తాచాటిన పవర్ లిఫ్టర్ చంద్రిక 

image

ఫిబ్రవరి 20 నుంచి 23వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సీనియర్ నేషనల్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంగళగిరి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ పవర్ లిఫ్టర్ బొలినేని చంద్రిక 84 కేజీల విభాగంలో 3 పతకాలు సాధించింది. పతకాలు సాధించిన చంద్రికను ఆమె కోచ్ నరేంద్ర రాజుని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ఛైర్మన్ వంశీకష్ణ, రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అభినందించారు. 

News February 24, 2025

గుంటూరులో 91 శాతం ప్రజెంట్ పోల్

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో గ్రూప్‌-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 8,673 మంది అభ్యర్థులు పరీక్షలకు హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వారిలో మొదటి పరీక్ష 7,927 మంది రాయగా.. రెండవ పరీక్షకు 7,920 మంది హాజరయ్యారు. మొత్తం 91 శాతం హాజరు పోల్ అయింది. కాగా గ్రూప్‌-2 మెయిన్ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9,277 మంది క్వాలిఫై అయినట్లు అధికారులు తెలిపారు.

error: Content is protected !!