News August 27, 2025

ప్రజా సమస్యలు మీడియా వెలికి తీయాలి: MP రఘునందన్

image

ప్రజా సమస్యలను మీడియా వెలికి తీసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన డిజిటల్ మీడియా అవగాహన సదస్సులో అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండాలన్నారు. ఖచ్చితమైన సమాచారం సేకరించి వార్తలు రాయాలని సూచించారు.

Similar News

News August 27, 2025

ఎల్లో అలర్ట్.. భారీ వర్షాలు

image

AP: అల్పపీడన ప్రభావంతో అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్లలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న శ్రీకాకుళంలో 16cm, కళింగపట్నం13.3cm, వైజాగ్‌లో 11.8cmల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

News August 27, 2025

DSCలో ఐదు ఉద్యోగాలు సాధించిన చేనేత కుమారుడు

image

ఉరవకొండకు చెందిన వరలక్ష్మి, ఎర్రిస్వామి కుమారుడు శ్రీనివాసులు ఇటీవలే విడుదలైన DSC ఫలితాలలో 5 ఉద్యోగాలు సాధించి తన ప్రతిభను కనబరిచారు. ఈ విజయం సాధించడానికి తన తల్లిదండ్రుల కృషి ఎంతగానో ఉందని అభ్యర్థి తెలిపారు. తను DSCలో SA, TGT మ్యాథ్స్, SA, TGT ఫిజిక్స్, TGT సైన్స్, SGT విభాగాలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. వారి తల్లిదండ్రులు చేనేతలు.

News August 27, 2025

జాతీయ అవార్డుకు ఎంపికైన జనగామ కవయిత్రి

image

తెలుగు భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఈనెల 31న ఆంధ్రప్రదేశ్ పల్నాడులో తెలుగు తేజం జాతీయ పురస్కారాలు అందజేయనున్నారు. ఈ క్రమంలో జనగామకు చెందిన ప్రముఖ కవయిత్రి బుదారపు లావణ్య ఎంపికైనట్లు నిర్వాహక సంస్థ అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక నిర్వహకులు తెలిపారు. జాతీయ స్థాయిలో తెలుగు కవులు కవయిత్రులను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు.