News April 4, 2025
ప్రతి ఇంటికి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో సూర్యఘర్ పథకం కింద ఎంపిక చేసిన 5 మోడల్ గ్రామాల్లో ప్రతి ఇంటికి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో మోడల్ గ్రామాల అభివృద్ధిపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. సూర్య ఘర్ పథకం అమల తీరుపై ఆరా తీశారు. సోలార్ ప్లాంట్ కు ముందుకు వచ్చే లబ్ధిదారులకు రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News September 15, 2025
చొప్పదండి: పురుగుల మందు తాగి హోంగార్డు ఆత్మహత్య

చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని కనకయ్య(46) ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు కరీంనగర్ కమిషనరేట్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడని, ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. చికిత్స నిమిత్తం అతడిని తరలించేలోపే మృతి చెందినట్లు వివరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 15, 2025
30L తల్లి పాలను దానం చేసిన గుత్తా జ్వాల

భారత మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల మంచి మనసు చాటుకున్నారు. తల్లి పాలకు దూరమైన శిశువులు అనారోగ్యం బారిన పడకుండా ఆమె తన పాలను దానం చేశారు. ఏప్రిల్లో బిడ్డను కన్న జ్వాల ఇప్పటివరకు దాదాపుగా 30L పాలను మిల్క్ బ్యాంక్కు అందించారు. ఈ విషయాన్ని ఆమె SM వేదికగా పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు జ్వాల విశాల హృదయానికి ఫిదా అవుతున్నారు. ఆమె అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారంటూ ప్రశంసిస్తున్నారు.
News September 15, 2025
విద్యాసంస్థలు జీవన వ్యవస్థలు: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

విద్యాసంస్థలు కేవలం భవనాలు కాదని, అవి దార్శనికత, విలువలు, ఉన్నత ప్రమాణాల కోసం నిరంతరం కృషి చేసే జీవన వ్యవస్థలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం దేశ నిర్మాణానికి దోహదపడే గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.