News August 15, 2024

ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి: కలెక్టర్

image

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు ప్రజలకు సూచించారు. కడప పోలీస్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలని, అన్ని సచివాలయాలలో జాతీయ జెండా ఎగురవేయాలని ఆదేశించారు.

Similar News

News July 6, 2025

MLA వరదకు సర్జరీ.. కాల్ చేసి మాట్లాడిన CM

image

ప్రొద్దుటూరు MLA వరదరాజులరెడ్డి గుండె ఓపెన్ సర్జరీ చేయించుకుని HYD ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విషయం తెలుసుకున్న CBN శనివారం వరదకు కాల్ చేసి ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలోకి రావాలంటూ ఆకాంక్షించినట్లు సమాచారం.

News July 6, 2025

కడప: ఈ నెల 10న మెగా పేరెంట్ టీచర్స్ కమిటీ సమావేశం

image

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ఈ నెల 10న జరిగే మెగా పేరెంట్ టీచర్ కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. అన్ని పాఠశాలలో మెరుగైన వసతులతో పాటు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు.

News July 6, 2025

ఈనెల 7న కడపకు YS జగన్

image

ఈనెల 7వ తేదీ కడప జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి YS జగన్ వస్తున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి కే.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. 7వ తేది మధ్యాహ్నం బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి 8న ఉదయం ఇడుపులపాయకు చేరుకుంటారన్నారు. మహానేత YS రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తారని అన్నారు. అనంతరం పులివెందులకు మీదుగా బెంగళూరుకు చేరుకుంటారన్నారు.