News November 27, 2024

ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం: జేసీ

image

తుఫాను భయంతో ముందస్తు కోతలు, నూర్పిడి చేయొద్దని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి రైతులకు సూచించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని భరోసానిచ్చారు. జిల్లా బుధవారం జిల్లాలోని మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. తుఫాను హెచ్చరికల విషయమై రైతులెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. రైతులకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు.

Similar News

News February 28, 2026

ఉండి: గ్యాస్ ప్రమాదం ఘటనలో మరో మహిళ మృతి

image

ఉండి చిక్కాల వీరన్న నగరంలో ఈనెల 24వ తేదీన జరిగిన గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో తల్లీకూతుర్లు మృతి చెందారు. ఎస్సై నజీరుల్లా తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాస్ సిలిండర్ సర్వీస్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి నలుగురికి గాయాలు అయ్యాయి. వీరిలో లక్ష్మి (50) గురువారం మృతి చెందింది. ఆమె తల్లి సుబ్బాయమ్మ (70) ఇప్పటికే మృతి చెందారు. మిగిలిన ఇద్దరు విజయవాడలో చికిత్స పొందుతున్నారని అన్నారు.

News February 28, 2026

నరసాపురంలో పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్

image

నరసాపురంలోని బొండమ్మ మహిళా వృద్ధాశ్రమంలో శనివారం కలెక్టర్‌ నాగరాణి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 24 రకాల పింఛన్లకు సంబంధించి 2,22,980 మంది లబ్ధిదారులకు రూ.96.39 కోట్లను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. పింఛన్లతో పాటు వృద్ధులకు పండ్లను పంపిణీ చేసి వారికి భరోసానిచ్చారు.

News February 28, 2026

పాతకక్షల భగ్గు: భీమవరంలో దారుణ హత్య

image

2022 డిసెంబరులో రఘు సోదరుడు ఏసు హత్యతో రెండు వర్గాల మధ్య కక్షలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 2023 సెప్టెంబర్ 17న గోవింద్, తన సోదరుడు విజయ్‌తో కలిసి భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వస్తుండగా.. గొల్లవానితిప్ప రోడ్డులోని కనకదుర్గ ఆలయం వద్ద రఘు తన అనుచరులతో కలిసి వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనలో విజయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గోవింద్ అక్కడి నుంచి పరారయ్యాడు.