News February 18, 2025
ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి: కలెక్టర్

స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్లాన్లో భాగంగా నియోజకవర్గ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి నియోజకవర్గ, మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామన్నారు.
Similar News
News December 18, 2025
MBNR: రేపు అంబులెన్స్ డ్రైవర్ల నియామకానికి ఇంటర్వ్యూలు

మహబూబ్నగర్ జిల్లాలోని 102 అంబులెన్స్ల్లో డ్రైవర్ల నియామకానికి ఈ నెల 19న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు, మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం, బ్యాడ్జి నంబర్ కలిగి ఉన్న 35 ఏళ్లలోపు వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో జిల్లా ఆసుపత్రిలోని 108 కార్యాలయంలో హాజరు కావాలి. 9491271103ను సంప్రదించాలని ఆయన కోరారు.
News December 18, 2025
క్యాబేజీలో నల్ల కుళ్లు తెగులు లక్షణాలు – నివారణ

నల్ల కుళ్లు తెగులు ఆశించి క్యాబేజీ మొక్క ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి వి(V) ఆకారంలో ఉన్న మచ్చలు ఏర్పడతాయి. ఈనెలు నల్లగా మారతాయి. ఈ తెగులు నివారణకు 10 లీటర్ల నీటిలో స్ట్రైప్టోసైక్లిన్ 1గ్రా. కలిపి నారు నాటినప్పుడు, గడ్డ తయారైనప్పుడు పైరుపై పిచికారీ చేయాలి. లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు కలిపి ఆ ద్రావణంతో మొక్కల మొదళ్ల చుట్టూ తడపాలి. ఎకరాకు 6 కిలోల బ్లీచింగ్ పౌడర్ను భూమిలో వేయాలి.
News December 18, 2025
పాపం.. ఆయనకు ఒక్కరే ఓటేశారు!

TG: నిన్న మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సందర్భంగా యాదాద్రి(D) అడ్డగూడూర్(M) ధర్మారంలో విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఒకటో వార్డులో మొత్తం 119 ఓట్లుండగా కప్పల గోపికి 118 ఓట్లు పడ్డాయి. ప్రత్యర్థికి ఒకే ఓటు పడింది. ఇక ఆదిలాబాద్(D) ఉండంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మహేందర్ తొలుత 4 ఓట్లతో ఓడిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఆయన రీకౌంటింగ్ కోరగా చివరికి మహేందరే 6 ఓట్లతో గెలుపొందారు.


