News March 25, 2025
ప్రతి మండలంలో ఒక మోడల్ అంగన్వాడి: కలెక్టర్

ప్రతి మండలంలో ఒక మోడల్ అంగన్వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ తెలిపారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో మహిళ, శిశు, దివ్యాంగుల వయేవృద్దుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి మండలంలో ఒక మౌడల్ అంగన్వాడి కేంద్రం ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు ఉన్నారు.
Similar News
News February 28, 2026
కృష్ణా: రేషన్ మాఫియా మాయాజాలం!

విజయవాడ సహా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియా రాజకీయ అండతో రెచ్చిపోతోందనే విమర్శలొస్తున్నాయి. పేదల బియ్యంపై ఏకంగా వేలం పాటలు నిర్వహిస్తూ, గెలిచిన వారు ప్రజాప్రతినిధులకు నెలకు రూ.10 నుంచి 15లక్షల వరకు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాము అనే వ్యక్తి సిండికేట్గా మారి రేషన్ విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం. పేదల పొట్ట కొట్టి ఇలా వ్యాపారం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
News February 28, 2026
బలిజిపేట: పైలేరియా రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం

జిల్లాలో పైలేరియా వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశించారు. శనివారం బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో ఆయన పర్యటించారు. జిల్లాలోని పైలేరియా బాధితులందరికీ ఎటువంటి అంతరాయం లేకుండా అవసరమైన మందులను నిరంతరం సరఫరా చేయాలన్నారు. దోమల నివారణకు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
News February 28, 2026
నరసాపురంలో పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్

నరసాపురంలోని బొండమ్మ మహిళా వృద్ధాశ్రమంలో శనివారం కలెక్టర్ నాగరాణి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 24 రకాల పింఛన్లకు సంబంధించి 2,22,980 మంది లబ్ధిదారులకు రూ.96.39 కోట్లను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పింఛన్లతో పాటు వృద్ధులకు పండ్లను పంపిణీ చేసి వారికి భరోసానిచ్చారు.


