News April 4, 2025
ప్రతి మహిళా లక్షాధికారి కావాలి: పార్వతీపురం కలెక్టర్

జిల్లాలోని స్వయం సహాయక బృందాల్లోని ప్రతి మహిళ లక్షాధికారి కావాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఏపీడీలు, ఏపీఎంలను ఆదేశించారు. జిల్లాలో దాదాపు 2 లక్షల 30 వేల మంది మహిళా సభ్యులు ఉండగా, వారిలో సగానికి పైగా లక్ష లోపు వార్షికాదాయం ఉందన్నారు. అటువంటి వారిని గుర్తించి, వారితో అనుకూలంగా ఉండే వ్యాపారాలను చేపట్టి ప్రతి మహిళను లక్షాధికారునిగా తీర్చిదిద్దాలని అన్నారు.
Similar News
News March 2, 2026
B-2 బాంబర్: ఆకాశంలో అజేయ మృత్యుపాశం!

ప్రపంచ గగనతల చరిత్రలో ఒక అద్భుతం B-2 Spirit Stealth Bomber. రాడార్లకే దొరకని దీని ‘స్టెల్త్’ టెక్నాలజీ శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. సుమారు 20 టన్నుల అణు లేదా సంప్రదాయ ఆయుధాలను మోస్తూ 50,000 అడుగుల ఎత్తు నుంచి మృత్యువులా విరుచుకుపడుతుంది. ఒక్కసారి ఇంధనం నింపితే 9,600km ప్రయాణించి ప్రపంచంలో ఏ మూలనైనా నిశ్శబ్దంగా ధ్వంసం చేయగలదు. అమెరికా గగనతల ఆధిపత్యానికి ఇదే కీలకం.
News March 2, 2026
కృష్ణా: మందుగుండు దుకాణాలపై పోలీసుల సోదాలు

కాకినాడలోని వేట్లపాలెంలో ఇటీవల సంభవించిన పేలుడు ఘటన నేపథ్యంలో కృష్ణాజిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ఉన్న మందుగుండు సామగ్రి స్థావరాలు, పటాకుల దుకాణాలలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తూ స్టాక్ వివరాలను సేకరిస్తున్నారు. నివాస ప్రాంతాల మధ్యలో అక్రమంగా మందుగుండు సామగ్రి నిల్వ ఉంచినట్లు సమాచారం అందిన చోట్ల ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు.
News March 2, 2026
చిత్తూరు: టీచర్లకు గమనిక

టీచర్ల సీనియారిటీ జాబితాను టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టిస్) ఆధారంగా సిద్ధం చేసినట్లు చిత్తూరు డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. డీఈవో, డీవైఈవో, ఎంఈవోల మెయిల్స్కు పంపించామని.. అభ్యంతరాలు ఉంటే ఈనెల 10వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయ పనివేళల్లో తెలియజేయాలని సూచించారు. తగిన ఆధారాలతో సంబంధిత ఉప, మండల విద్యాశాఖాధికారులు ధ్రువీకరించిన పత్రాలను అందజేయాలన్నారు.


