News March 5, 2025

ప్రతి రైతుకు రూ.20,000 అందిస్తాం: అచ్చెన్న

image

రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20వేలు అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మ్యానిఫేస్టోలో చెప్పినట్లుగానే అర్హత కలిగిన రైతులకు సహాయాన్ని అందజేస్తామని ఆయన అన్నారు.

Similar News

News March 6, 2025

వజ్రపుకొత్తూరు: రిటైర్ట్ తెలుగు టీచర్ మృతి

image

వజ్రపుకొత్తూరు పూండి గోవిందపురానికి చెందిన రిటైర్డ్ తెలుగు టీచర్, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ తెలికిచెర్ల ప్రసాదరావు బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన పూండి పరిసర ప్రాంతాలలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారని గ్రామస్థులు తెలిపారు. ఆయన మృతితో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. 

News March 6, 2025

అదనపు వసూళ్లు చేస్తే చర్యలు తప్పవు: జేసీ

image

గ్యాస్ డెలివరీ ఛార్జీల పేరిట అదనపు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ ఫర్మాధ్ అహ్మద్ ఖాన్ హెచ్చరించారు. ఇటీవల పొందూరు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ మీద వచ్చిన ఫిర్యాదుల మేరకు పొందూరు పట్టణంలో గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్స్‌ను జేసీ బుధవారం విచారించారు. అదనపు ఛార్జీలు వసూలు చేయడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.

News March 5, 2025

శ్రీకాకుళం: ప్రముఖ లలిత సంగీత కళాకారుడి మృతి

image

శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ సంగీత కళాకారుడు, గురువు బండారు చిట్టి బాబు బుధవారం మరణించారు. లలిత సంగీత ప్రపంచంపై తనదైన ముద్ర వేసి ఎంతో మంది శిష్యులకు సంగీత పాఠాలు నేర్పిన చిట్టిబాబు మరణం పట్ల జిల్లాలో సంగీత కళాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఆకాశవాణిలో పనిచేస్తూ మత సామరస్య గీతాలు కంపోజ్ చేయడం ఆయన ప్రత్యేకత అని పలువురు తెలిపారు.

error: Content is protected !!