News May 5, 2024

ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలి: షర్మిల

image

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇవాళ కోవూరులో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, రైతుల రుణ మాఫీ జరగలన్నా , ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 1 లక్ష ఆర్థిక సాయం కావాలన్నా ఎమ్మెల్యే గా కిరణ్ ను, ఎంపీగా కె.రాజును గెలిపించాలని ఆమె కోరారు.

Similar News

News October 22, 2025

గుడ్లురులో ప్రమందం.. 50కి పైగా గొర్రెలు మృతి

image

గుడ్లూరు మండలంలో మంగళవారం రాత్రి నేషనల్ హైవే‌పై దారుణం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఓ కంటైనర్ వాహనం గొర్రెల మందను ఢీ కొట్టడంతో 50కి పైగా గొర్రెలు మృతి చెందాయని స్థానికులు తెలిపారు. మోచర్ల – వీరేపల్లి గ్రామాల మధ్య గొర్రెల మందను నేషనల్ హైవేపై క్రాస్ చేయిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వివరించారు. కేసు నమోదు చేయనున్నట్లు గుడ్లూరు పోలీసులు తెలిపారు.

News October 21, 2025

రేపు అన్ని జూనియర్ కాలేజీలకు సెలవు

image

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుధవారం అన్ని జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు RIO వర ప్రసాద్ తెలిపారు. నెల్లూరు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అన్నింటికీ సెలవు ప్రకటించినట్లు వివరించారు. ఉత్తర్వులు ఉల్లంఘించిన విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 21, 2025

పురమిత్ర యాప్‌తో ఆన్లైన్ సేవలు సులభతరం

image

పురమిత్ర యాప్ ద్వారా మున్సిపల్ ఆన్లైన్ సేవలు సులభతరం అవుతాయని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్
మంగళవారం తెలిపారు. పురమిత్ర ఫోన్ యాప్ ద్వారా వివిధ రకాల టాక్స్‌లు సులభంగా చెల్లించవచ్చన్నారు. https://play.google.com/store/apps/details?id=com.dreamstep.apcmmscitizen ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. దీని ద్వారా ఫిర్యాదులు కూడా చేయవచ్చని పేర్కొన్నారు.