News October 11, 2025

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌నా ఏర్పాట్లు ముమ్మరం: మంత్రి

image

ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ ప‌ర్య‌ట‌న‌ ఏర్పాట్లు ముమ్మరంగా నిర్వహిస్తున్నామనిరాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. శుక్రవారం ఆయన రాగ‌మ‌యూరి వ‌ద్ద ఏర్పాట్లను ప్ర‌ధాని ప్రోగ్రాం స్పెషల్ ఆఫీస‌ర్ వీర పాండియ‌న్‌తో క‌లిసి స్టేజీ, గ్యాల‌రీ నిర్మాణ ప‌నులు ప‌రిశీలించారు. హెలిప్యాడ్, రోడ్లు, పార్కింగ్ ప‌నుల పురోగ‌తిని తెలుసుకున్నారు. నిర్దేశించిన గ‌డువులోపు ప‌నులు పూర్త‌య్యేలా చూడాల‌న్నారు.

Similar News

News October 10, 2025

పోలీస్ పెట్రోలింగ్ గస్తీ ముమ్మరం: ఎస్పీ

image

కర్నూలులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ప్రజల భద్రత రక్షణలో భాగంగా ప్రధాన రహదారుల్లో పోలీసుల పెట్రోలింగ్, గస్తీని ముమ్మరం చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. గురువారం కర్నూలులో ప్రధాని సభ వద్ద బాంబు స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్‌తో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి నేరాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News October 9, 2025

కర్నూలు జిల్లా నూతన జేసీగా నూరుల్

image

కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో నూరుల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నవ్యను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్ పర్సన్‌గా నియమించింది.

News October 8, 2025

నేటి నుంచి ఎస్జీఎఫ్ అండర్-19 క్రీడా పోటీలు

image

కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో నేటి నుంచి ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్-19 బాలబాలికల విభాగంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, 9న చెస్, క్యారమ్స్, బాస్కెట్బాల్, పవర్ లిఫ్టింగ్, బాల్ బ్యాడ్మింటన్, 10న బ్యాడ్మింటన్, బేస్ బాల్, సాఫ్ట్ బాల్, త్రో బాల్, 11న హ్యాండ్ బాల్, హాకీ, రోప్ స్కిప్పింగ్, రోల్ బాల్, 13న క్రికెట్, యోగా ఎంపిక పోటీలు ఉంటాయని ఎస్జీఎఫ్ కార్యదర్శి రాఘవేంద్ర మంగళవారం తెలిపారు.