News January 14, 2026
ప్రధాని మెచ్చిన కాకినాడ యువకుడి ఐడియా

కాకినాడ జిల్లా కేఈ చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన యువకుడు కొరుప్రోలు శివ మణికంఠ జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించారు. ఈనెల 12న ఢిల్లీలో జరిగిన ‘వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2026’లో ఆయన పాల్గొని, వ్యవసాయ రంగంలో తనకున్న వినూత్న ఆలోచనలను ప్రధాని మోదీ సమక్షంలో ప్రదర్శించారు. శివ మణికంఠ టాప్-5 ఐడియా విభాగంలో నిలవడం విశేషం. ఈ యువకుడి ఘనతపై జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News February 14, 2026
పెద్లపల్లి: మూడు మున్సిపాలిటీల్లో ఒక్కొక్క వార్డులో గెలుపు

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగగా ఫలితాలు బీఆర్ఎస్ శ్రేణులను నివ్వెర పరిచాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఒక్కొక్క వార్డులోనే గెలుపుతో ఆ పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పెద్దపల్లిలో 36 వార్డుల్లో ఒకటి, సుల్తానాబాద్ లో 15 వార్డుల్లో ఒకటి, మంథనిలో 13 వార్డులకు ఒకటి చొప్పున మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది.
News February 14, 2026
రామాయంపేట: డైరెక్టర్గా ఉంటూ.. కౌన్సిలర్గా గెలుపు

మహంకాళి దేవాలయం డైరెక్టర్గా సేవలు అందిస్తున్న బైరం స్వప్న, ఇప్పుడు రామాయంపేట కౌన్సిలర్గా తన ముద్ర వేశారు. 4వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె, సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై 139 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలోనే ఆమెను దేవాలయ డైరెక్టర్గా ఎమ్మెల్యే రోహిత్ నియమించారు. ఆధ్యాత్మిక సేవలతో పాటు ఇప్పుడు వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని స్వప్న ధీమా వ్యక్తం చేశారు.
News February 14, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.15,800
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,536
* వెండి 10 గ్రాములు ధర రూ.2,550.


