News February 28, 2025
ప్రధానోపాధ్యాయుడిని అభినందించిన అమెరికా రాయబారి

రామప్ప ఆలయ సందర్శనానికి వచ్చిన అమెరికా రాయబారి జెనీఫర్ లాడ్సన్తో అమెరికా ఎన్నారై పులి రవి గౌడ్ ఆధ్వర్యంలో కాటాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు మాటాముచ్చట చేశారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ ఆనందంగా విద్య నభ్యసించాలని జెనీఫర్ లాడ్సన్ అన్నారు. విద్యార్థుల అభివృద్ధిని ప్రోత్సహిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ ను ఆమె అభినందించారు.
Similar News
News February 28, 2025
బాపట్ల: మైనర్ బాలికపై అత్యాచారం

బాపట్ల జిల్లా నగరం మండలంలోని ఓ గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై 17 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరం ఎస్ఐ బండ్ల భార్గవ్ వివరాల ప్రకారం.. ఈనెల 25న ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని బలవంతంగా దగ్గరలో ఉన్న స్కూల్ బస్సులోకి లాక్కొని వెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
News February 28, 2025
ఆసిఫాబాద్: బర్డ్ ఫ్లూ.. భయపడుతున్న జనం

బర్డ్ ఫ్లూ వైరస్ ASF జిల్లాలో చికెన్ షాపుల నిర్వాహకులకు ఇబ్బందులు పడుతున్నాయి. కేజీ ధర రూ. 180 ఉన్నా వైరస్ భయంతో జనం చికెన్ కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. ప్రత్యామ్నాయంగా మటన్, చేపలకు డిమాండ్ పెరిగింది. రూ. 800 ఉన్న మటన్ రూ. 250 పెంచేస్తున్నారు. ధరల పెరుగుదలతో మాంసం ప్రియులు నోటికి తాళం వేస్తున్నారు. ఇదిలా ఉండగా నేడు కాగజ్నగర్ పట్టణంలోని చికెన్ దుకాణ యజమానులు చికెన్ మేళా నిర్వహిస్తున్నారు.
News February 28, 2025
పెళ్లిళ్లలో ప్రీ వెడ్డింగ్ షూట్, డీజే బంద్

TG: ప్రీ వెడ్డింగ్ షూట్, చెవులు పగిలేలా డీజే డాన్సులు పెళ్లిళ్లలో కామన్ అయిపోయాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలోని ఓ తండావాసులు సంప్రదాయాన్ని కాపాడుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. శివరాత్రి సందర్భంగా ఉట్నూర్ మం. శ్యాం నాయక్ తండా వాసులందరూ సమావేశమై.. ప్రీ వెడ్డింగ్ షూట్, డీజే, హల్దీ వంటి కార్యక్రమాలను నిషేధిస్తున్నామన్నారు. సంప్రదాయ పద్ధతిలోనే పెళ్లి చేసుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై మీ కామెంట్?