News August 19, 2025

ప్రపంచ‌కప్‌ పోటీలకు సూర్యాపేట బిడ్డ

image

సూర్యాపేట (D) చెందిన నరేష్ యాదవ్ అమెరికాలో జరగనున్న సిటింగ్ వాలీబాల్ వరల్డ్ కప్ 2025 పోటీలకు ఎంపికయ్యాడు. మేళ్లచెరువు (M) కందిబండకి చెందిన నరేష్ అక్టోబర్ 8 నుంచి 18 వరకు జరిగే ఈ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. జాతీయ ఛాంపియన్‌షిప్‌లో అతని ప్రతిభ ఆధారంగా పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది. ఈ అవకాశం పొందడం ద్వారా నరేష్ స్వగ్రామానికి, రాష్ట్రానికి పేరు తీసుకొచ్చాడు.

Similar News

News August 19, 2025

యాదాద్రి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా నరోత్తం రెడ్డి

image

యాదాద్రి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా బీబీనగర్ మండలం గూడూరు గ్రామానికి చెందిన గూడూరు నరోత్తం రెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకాన్ని జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ మంగళవారం ప్రకటించారు. తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర, జిల్లా నాయకులకు ధన్యవాదాలు నరోత్తం రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడతానని, రాబోయే స్థానిక ఎన్నికలలో బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు.

News August 19, 2025

‘వార్-2’కు రూ.300 కోట్ల కలెక్షన్స్

image

‘వార్-2’ సినిమా ఇప్పటివరకు రూ.300.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది. ఇండియాలో రూ.240 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.60.50 కోట్లు వచ్చినట్లు తెలిపింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హృతిక్ రోషన్, Jr.NTR ప్రధాన పాత్రల్లో నటించారు. YRF స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ మూవీ అగస్టు 14న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

News August 19, 2025

ఐదుగురు మృతి.. నివేదిక కోరిన HRC

image

HYD రామంతాపూర్‌లో విద్యుత్ షాక్‌తో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన <<17438408>>ఘటనను <<>>రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఘటనకు కారణాలు, బాధిత కుటుంబాలకు పరిహారంతో పాటు భద్రతా చర్యలపై విద్యుత్ శాఖను నివేదిక కోరింది. సెప్టెంబర్ 22లోపు ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని TGSPDCL CMDకి గడువు విధించింది.