News January 25, 2025
ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం: శ్రీధర్ బాబు

మంథని ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు ‘డ్రీమ్ ల్యాబ్ టెక్నాలజీస్’ ప్రతినిధి నిక్ మాయెన్కోర్ట్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల అవకాశాలు, సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఆర్థిక అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. డ్రీమ్ ల్యాబ్ టెక్నాలజీస్ వంటి ప్రముఖ సంస్థలతో కలసి పనిచేయడం ద్వారా రాష్ట్రానికి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
Similar News
News February 28, 2026
22,195 ప్రభుత్వ ఉద్యోగాలు.. 2 రోజులే ఛాన్స్

రైల్వేలో 22,195 గ్రూప్-D ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 2 లాస్ట్ డేట్. సికింద్రాబాద్ పరిధిలో 1,012 పోస్టులున్నాయి. జాబ్ను బట్టి టెన్త్, సంబంధిత ట్రేడులో ఐటీఐ పాసై, 18-36 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. రిజర్వేషన్ను బట్టి ఏజ్లో సడలింపు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: https://www.rrbapply.gov.in/
News February 28, 2026
ఇండియన్స్కు ఎంబసీల సూచనలు

యుద్ధ <<19260918>>వాతావరణం<<>> దృష్ట్యా ఇజ్రాయెల్, ఇరాన్లోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయాలు సూచించాయి. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, స్థానిక భద్రతా మార్గదర్శకాలను పాటించాలని పేర్కొన్నాయి. ఎమర్జెన్సీ అయితే ఇజ్రాయెల్లో +972-54-7520711, ఇరాన్లో +989128109115 OR +989128109109 నంబర్లకు కాల్ చేయాలని తెలిపాయి. అలాగే ఇరు దేశాల ఎయిర్స్పేస్ను మూసేయడంతో ఎక్కడికక్కడ విమాన ప్రయాణాలు ఆగిపోయాయి.
News February 28, 2026
మోదీ పర్యటన ముగిసిన వెంటనే ప్లాన్ అమలు!

ఇరాన్పై దాడికి అమెరికా-ఇజ్రాయెల్ చాలా రోజుల కిందటే ప్లాన్ చేశాయి. భారత PM మోదీ ఈ నెల 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్లో పర్యటించిన నేపథ్యంలో అటాక్ను వాయిదా వేసినట్లు నిపుణుల అంచనా. ఆయన దేశంలో ఉండగా ఉద్రిక్తతలకు తావు లేకుండా నెతన్యాహు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. కాగా మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన వెంటనే ఇరాన్పై US దాడి చేస్తుందని MIM చీఫ్ అసదుద్దీన్ ఇటీవల చెప్పిన <<19240749>>జోస్యం<<>> నిజమైంది.


