News September 26, 2024

ప్రపంచ మైనింగ్ ప్రదర్శనలో పాల్గొన్న భట్టి, సింగరేణి C&MD

image

అమెరికా లాస్‌వెగాస్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మైనింగ్ ప్రదర్శనను ‘MINExpo’ ను DY CM భట్టి విక్రమార్క, సింగరేణి C&MD బలరాం నాయక్, అధికారుల బృందం పరిశీలించింది. ఈ నెల 24 నుంచి 26 వరకు జరిగే ఈవెంట్‌లో తాజా మైనింగ్ ఆవిష్కరణలు, సాంకేతికత, యంత్రాలను ప్రదర్శించారు. పరిశ్రమల నిపుణులతో నెట్‌వర్క్‌కు అవకాశాలను వివరించారు. ఈవెంట్‌లో 125 దేశాల కంపెనీల నుంచి 44,000 మంది నిపుణులు పాల్గొన్నారు.

Similar News

News September 16, 2025

పోషణ మాసోత్సవాలకు ఎమ్మెల్యే కవ్వంపల్లికి రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం

image

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు జరిగే పోషణ మాసోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనాయణకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ మేరకు, కరీంనగర్ జిల్లా మహిళా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి, మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆహ్వాన పత్రాన్ని మంగళవారం ఎల్‌ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో ఎమ్మెల్యేకు అందజేశారు.

News September 16, 2025

కరీంనగర్: ‘చేప పిల్లల పంపిణీ త్వరగా చేపట్టాలి’

image

మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ త్వరగా చేపట్టాలని, కరీంనగర్ జిల్లాలోని మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం మత్స్య శాఖ కమిషనర్ ఐఏఎస్ నిఖిలకు కరీంనగర్ జిల్లా మత్స్యకారులు వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ మత్స్యశాఖ కార్యాలయంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని, చేప పిల్లలను సకాలంలో పంపిణీ చేస్తేనే మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందన్నారు.

News September 16, 2025

కరీంనగర్: కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్‌గా విద్యాసాగర్

image

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ SC సెల్ కన్వీనర్‌గా శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన కనకం విద్యాసాగర్ నియమితులయ్యారు. ఈ నియామక పత్రాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణ అందజేశారు. LMDలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విద్యాసాగర్‌ను అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని విద్యాసాగర్ తెలిపారు.