News February 11, 2025
ప్రభుత్వాసుపత్రిలో కాన్పులను పెంచాలి: DMHO

కోదాడలో కాపుగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, కోదాడ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోట చలం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు, రికార్డులు నిర్వహణ అంశాలపై ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వివరించారు.
Similar News
News February 14, 2026
సింగరేణిలో డంప్మెన్ పోస్టులకు పరీక్ష

సింగరేణి రామగుండం-2 ఏరియాలో డంప్మెన్ (ట్రిప్మెన్) ఖాళీల భర్తీకి సెకార్-3 సింగరేణి స్కూల్లో అంతర్గత పరీక్ష నిర్వహించారు. 23 మందికి గానూ 21 మంది హాజరయ్యారు. ఎస్.ఓ టు జీఎం సంతోష్ కుమార్ ప్రశ్నపత్రాల సీలును తెరిచారు. ఐఈడీ డీజీఎం చంద్రశేఖర్, డీవైపీఎం వంశీధర్, ప్రిన్సిపల్ సుందర్ రాజు పాల్గొన్నారు. ఏఎస్ఓ షరీఫ్ మహ్మద్ ఆధ్వర్యంలో సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
News February 14, 2026
ప్రొద్దుటూరు: నెహ్రూ రోడ్డులో దారుణ హత్య

ప్రొద్దుటూరు పట్టణం నెహ్రూ రోడ్డులో శుక్రవారం రాత్రి సుబ్బు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సుబ్బు బేల్దారి పని చేస్తుంటాడని స్థానికులు తెలిపారు. సుబ్బు, వినయ్ మద్యం తాగి గొడవ పడినట్లు, ఈ గొడవ హత్య వరకు వెళ్లిన్నట్లు సమాచారం. 3వ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 14, 2026
విశాఖ చేరుకున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్

విశాఖలో రెండు రోజుల పర్యటన నిమిత్తం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ శుక్రవారం విశాఖ చేరుకున్నారు. ఆయనకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కలెక్టర్తో పాటు పలువురు కోర్ట్ అధికారులు ఉన్నారు.


