News October 8, 2025

ప్రభుత్వ కళాశాలల్లో వంద శాతం ఎఫ్ఆర్ఎస్ నమోదు: డీఐఈఓ

image

వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు(రిజిస్ట్రేషన్) వంద శాతం పూర్తి చేసినట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1191 ప్రథమ సం., 959 ద్వితీయ సం. మొత్తం 2,150 మందికి గాను 2150 మంది విద్యార్థులు, 187 మంది సిబ్బంది పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు తెలిపారు. ముఖ గుర్తింపు హాజరు రిజిస్ట్రేషన్‌లో వరంగల్ జిల్లా ముందంజలో ఉందన్నారు.

Similar News

News October 8, 2025

స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: వరంగల్ కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ నెల 23, 27 తేదీల్లో, అలాగే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నవంబర్ 4, 8 తేదీల్లో జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని మొత్తం 317 గ్రామ పంచాయతీల్లో గల 2,754 వార్డులకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News October 8, 2025

భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి ద్వారా రైతులు సకాలంలో తమ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేలా చొరవ చూపాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటనే ఆర్జీలను పరిష్కరించాలని ఆమె స్పష్టం చేశారు. నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో భూభారతి అమలుపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.

News October 8, 2025

NSPT: పారా మెడికల్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ పారా మెడికల్ కళాశాలలో రెండు కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. ఈసీజీ డిప్లొమాలో 30 సీట్లు, డిప్లొమా డయాలసిస్‌లో 30 సీట్లు ఉన్నట్లు చెప్పారు. ఈ నెల 28 వరకు నర్సంపేట మెడికల్ కాలేజీలో దరఖాస్తులను చేసుకోవచ్చని పేర్కొన్నారు.