News April 17, 2024

ప్రభుత్వ ఖజానాకు రూ.60 కోట్ల టోకరా

image

కోదాడ పరిధిలోని కొమరబండ గ్రామ శివారులో ఉన్న వెంకటేశ్వర మిల్లుపై అడిషనల్ కలెక్టర్ లతా విజిలెన్స్ అధికారులతో మంగళవారం దాడులు నిర్వహించారు. రైస్ మిల్లులో ఉన్న సీఎంఆర్ నిలువలను తనిఖీ చేశారు. సుమారు 22 వేల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎఫ్సీఐకి బాకీ ఉన్నట్లు తెలిపారు. 60 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ దాడుల్లో ఆర్డీవో సూర్యనారాయణ, డీఎం సివిల్ సప్లై రాములు ఉన్నారు.

Similar News

News September 11, 2025

NLG: మద్యం టెండర్లకు కసరత్తు

image

జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగియనున్న నేపథ్యంలో, ఆబ్కారీ శాఖ కొత్త టెండర్ల నిర్వహణకు సిద్ధమవుతోంది. 2025-27 సంవత్సరాలకు సంబంధించి, అక్టోబర్‌లోనే టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. డిసెంబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మొత్తం 155 మద్యం దుకాణాలకు టెండర్లు వేగవంతం చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.

News September 11, 2025

NLG: మద్యం టెండర్లకు కసరత్తు

image

జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగియనున్న నేపథ్యంలో, ఆబ్కారీ శాఖ కొత్త టెండర్ల నిర్వహణకు సిద్ధమవుతోంది. 2025-27 సంవత్సరాలకు సంబంధించి, అక్టోబర్‌లోనే టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. డిసెంబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మొత్తం 155 మద్యం దుకాణాలకు టెండర్లు వేగవంతం చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.

News September 11, 2025

NLG: పాఠశాలలకు నిధులు మంజూరు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 2.79 కోట్లు మంజూరు చేసింది. పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి అందాల్సిన నిధులు ఆలస్యంగా విడుదలయ్యాయి. నల్గొండ జిల్లాలోని 1,068 పాఠశాలలకు రూ.1.25 కోట్లు, యాదాద్రి జిల్లాలోని 599 పాఠశాలలకు రూ.71 లక్షలు, సూర్యాపేట జిల్లాలోని 747 పాఠశాలలకు రూ.83.47 లక్షలు పాఠశాలల ఖాతాల్లో జమ కానున్నాయి.