News July 26, 2024
ప్రభుత్వ నిర్ణయంతో 4 లక్షల ఎకరాలకు బోనస్

33 రకాల సన్నరకాల వంగడాలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. మిర్యాలగూడ, గరిడేపల్లి, నేరేడుచర్ల, హుజూర్నగర్, కోదాడ, చిలుకూరు ప్రాంతాల్లో లక్షల మంది రైతులు ఏటా సాగర్ ఎడమ కాల్వ కింద సన్నరకాలనే సాగు చేస్తున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో సుమారు 4 లక్షల ఎకరాల్లో పండే సన్నరకాలకు బోనస్ రానుంది.
Similar News
News September 13, 2025
నకిరేకల్: విద్యార్థినికి వేధింపులు.. టీచర్ సస్పెండ్..!

నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్గా పనిచేస్తున్న మామిడి శ్రీనివాస్పై <<17696456>>లైంగిక వేధింపుల <<>>ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారి విచారణ జరిపి నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి పంపించారు. నివేదిక అందిన వెంటనే సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
News September 13, 2025
సత్తా చాటిన నల్గొండ పోలీస్

హైదరాబాద్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో మూడు రోజులపాటు నిర్వహించిన 7వ ఆల్ ఇండియా జైళ్ల శాఖ క్రీడల్లో 24 రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఈ క్రీడల్లో నల్గొండ జిల్లా జైలు పోలీస్ మామిడి చరణ్ 80 కిలోల విభాగంలో కరాటే పోటీల్లో స్వర్ణ పతకం సాధించి తెలంగాణకు గౌరవం తీసుకొచ్చాడు. ఈ విజయంపై జైలు అధికారులు, పోలీసులు శ్రావణ్, గణేష్, సైదులు, రాంబాబు అభినందనలు తెలిపారు.
News September 13, 2025
నల్గొండ: ఆర్టీసీకి రూ.32.59 లక్షల ఆదాయం

నల్గొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుంచి వివిధ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా నాలుగు నెలల్లో రూ.32.59 లక్షల ఆదాయం సమకూరిందని ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. జూన్లో 22 బస్సులతో రూ. 11.95 లక్షలు, జూలైలో 22 బస్సులతో రూ. 13 లక్షలు, ఆగస్టులో 18 బస్సులతో రూ. 6.47 లక్షలు, సెప్టెంబర్లో 3 బస్సులతో రూ. 1.16 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆయన వివరించారు.