News February 25, 2026
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయాలి: కలెక్టర్

మార్టూరు మండల స్థాయి అధికారులకు బుధవారం కలెక్టరేట్లో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో శాఖల మధ్య సమన్వయం ఉండాలని, ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో అందించాలని సూచించారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి నిర్ణీత గడువులోగా లక్ష్యాలను చేరుకోవాలని ఆయన ఆదేశించారు.
Similar News
News February 28, 2026
గల్ఫ్లో ఉన్న తెలుగువాళ్లు జాగ్రత్త!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్లో ఉన్న తెలుగువాళ్లు జాగ్రత్తగా ఉండాలని ఇక్కడి వారి బంధువులు కోరుకుంటున్నారు. యుద్ధం వార్తలు చూసి వాళ్లు ఎలా ఉన్నారో? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు UAE, సౌదీ అరేబియా, జోర్డాన్తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లోని IND ఎంబసీలు అడ్వైజరీలు జారీ చేశాయి. అవసరమైతేనే ప్రయాణాలు చేయాలన్నాయి. మరోవైపు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతల నడుమ దుబాయ్ ఎయిర్పోర్టును క్లోజ్ చేశారు.
News February 28, 2026
HYDలో కీలక నిర్ణయం.. ఇక ప్రతి ఆదివారం..!

గ్రేటర్ పౌరుల ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం కల్పించేందుకు జీహెచ్ఎంసీ చర్యలకు దిగింది. ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (PTP) కార్యక్రమాన్ని వచ్చే మార్చి నెలలో ప్రతి ఆదివారం నిర్వహించనున్నట్లు కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. అధికారులు పన్ను సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరిస్తారు.
News February 28, 2026
సంగారెడ్డి: పెండింగ్ కేసులపై ఎస్పీ స్పెషల్ యాక్షన్ ప్లాన్!

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇన్వెస్టిగేషన్లో ఉన్న గ్రేవ్, మిస్సింగ్, ఎన్బీడబ్ల్యూ కేసుల పురోగతిని సమీక్షించిన ఎస్పీ.. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దర్యాప్తులో నాణ్యత పెంచి, కేసులను త్వరగా కొలిక్కి తీసుకురావాలని స్పష్టం చేశారు.


