News September 20, 2025
ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సుభాశ్

రామచంద్రపురంలో కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ పాఠశాలను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. 9,10 తర్వాత విద్యార్థులకు మంత్రి కౌన్సెలింగ్ నిర్వహించారు. మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, వాటి బారిన పడితే భవిష్యత్తు అంధకారమేనని విద్యార్థులకు హితవు పలికారు. తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయొద్దని, మంచి భవిష్యత్తు పొందేలా శ్రద్ధగా చదవాలని సూచించారు.
Similar News
News September 21, 2025
వేయి స్తంభాల గుడిలో వేడుకలు.. హాజరుకానున్న మంత్రులు

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలు రేపు వేయిస్తంభాల గుడిలో ప్రారంభం కానున్నాయి. ప్రారంభ వేడుకలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క హాజరు కానున్నారు. రాష్ట్ర మహిళలకు మంత్రి కొండా సురేఖ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి సురేఖ తెలిపారు.
News September 21, 2025
కూటమి పార్టీలు మరో 15 ఏళ్లు కలిసే ఉంటాయి: మంత్రి మనోహర్

AP: కూటమి పార్టీలు మరో 15 ఏళ్లు కలిసే ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి, సంక్షేమానికే CM చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ప్రజాప్రయోజనాల కోసమే Dy.CM పవన్ కళ్యాణ్ నిలబడ్డారని వివరించారు. ఇటీవల అసెంబ్లీలో బోండా ఉమ, పవన్ <<17776165>>ఎపిసోడ్<<>> తర్వాత ఇరుపార్టీల బంధంపై పలు ప్రశ్నలు ఉత్పన్నం కాగా, పైవ్యాఖ్యలతో వాటికి మనోహర్ క్లారిటీ ఇచ్చినట్లైంది.
News September 21, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 21, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.09 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.31 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.13 గంటలకు
✒ ఇష: రాత్రి 7.25 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.