News September 21, 2024

ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత తహశీల్దార్లదే: సంగారెడ్డి కలెక్టర్

image

ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత తహశీల్దార్లదేనని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ధరణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని చెప్పారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవోలు పాల్గొన్నారు.

Similar News

News September 21, 2024

కొండా లక్ష్మణ్‌బాపూజీ తెలంగాణకు నిత్యస్ఫూర్తి: కేసీఆర్

image

తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం తన జీవితకాలం పోరాడిన తొలితరం నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని, ఆయన తెలంగాణకు నిత్యస్ఫూర్తి అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన బాపూజీ స్ఫూర్తి తాను సాగించిన చివరిదశ తెలంగాణ సాధన పోరాటంలో ఇమిడి ఉన్నదని తెలిపారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని వారి కృషిని కేసీఆర్‌ స్మరించుకున్నారు.

News September 21, 2024

బెజ్జంకి: కుటుంబ కలహాలో తల్లీ, కూతురు ఆత్మహత్య

image

సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ తల్లి తన కూతురితో సహా సూసైడ్ చేసుకుంది. స్థానికుల సమాచారం.. జనగాం జిల్లాకు చెందిన రాజు జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి బెజ్జంకి మండలానికి వలస వచ్చి కూలీ పనులు చేస్తున్నారు. రాజు మద్యానికి బానిసై తరుచుగా భార్య శారద, పిల్లలతో గొడవ పడేవాడు. గురువారం అర్ధరాత్రి సైతం గొడవ పడగా మనస్తాపానికి గురై శారద కుమార్తెతో సాహ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

News September 21, 2024

తిరుమల లడ్డూ కల్తీపై చర్యలు తీసుకోవాలి: ఎంపీ రఘునందన్

image

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం దారుణమని, బాధ్యులు ఎవరైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు.ఈ మేరకు ఎంపీ Xలో పోస్టు చేశారు. పవిత్రతకు మారుపేరైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం కల్తీ చేయడం క్షమించరాని నేరం అన్నారు. 2019 నుంచి 2024 వరకు తిరుమలలో జరిగిన ఘటనలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించి చర్యలు తీసుకోవాలన్నారు.