News September 26, 2024
ప్రభుత్వ లాంఛనాలతో మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు
మాజీ MP మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరై నివాళులర్పించారు. తొలుత మాగుంట నివాసంలో పార్వతమ్మ పార్థివ దేహానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించగా, పోలీసు బ్యాండ్తో గాల్లోకి 3రౌండ్ల కాల్పులు జరిపి నివాళులర్పించారు. ఈ అంత్యక్రియల్లో MLAలు సోమిరెడ్డి, దామచర్ల జనార్ధన్, నేతలు, పెద్దఎత్తున మాగుంట అభిమానులు పాల్గొన్నారు.
Similar News
News September 29, 2024
ఈవీఎంల గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు: కలెక్టర్
ఈవీఎంల గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా శనివారం సాయంత్రం స్థానిక ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ గోడౌన్ల లోని ఈవీఎంలు, వివి ప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు.
News September 28, 2024
వేదాయపాలెం రైల్వే స్టేషన్లో వృద్ధురాలు
నెల్లూరు నగరం వేదయపాలెం రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలను వదిలేసి వెళ్లినట్టు ప్రయాణికులు తెలిపారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ప్రయాణికులు 108 సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. ఆమెను వివరాలు అడగగా.. తన పేరు బుజ్జమ్మని మిగిలిన వివరాలు చెప్పలేకపోయిందని అధికారులు తెలిపారు.
News September 28, 2024
నెల్లూరు: ‘తూకాలు తక్కువగా తూస్తే చర్యలు’
వ్యాపారులు కాటాల్లో తేడాలు చేసి తక్కువగా తూస్తే కఠిన చర్యలు తప్పవని తూనికల కొలతల శాఖ జిల్లా డిప్యూటీ కంట్రోలర్ కే ఐసాక్ హెచ్చరించారు. శుక్రవారం ఉదయం నెల్లూరు నగరంలోని ఏసీ కూరగాయల మార్కెట్లో ఆయన తనిఖీలు చేశారు. పలు దుకాణాల కాటాలను పరిశీలించారు. ప్రతి వ్యాపారి తప్పనిసరిగా కాటాలను రెన్యువల్ చేయించుకోవాలన్నారు.