News June 19, 2024

ప్రభుత్వ సేవలను విస్తృతం చేయాలి: అన్నమయ్య కలెక్టర్

image

ప్రభుత్వ శాఖలలో ప్రజలకు అందించే రోజువారి సేవలను విస్తృతం చేయడంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటిలోని కలెక్టరేట్లో ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. గ్రామ వార్డు సచివాలయ సేవలు, భూ సేకరణ, సివిల్ సప్లై తదితర అంశాలపై వారికి దిశా నిర్దేశం చేశారు.

Similar News

News October 4, 2024

కడప: నూతన పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు

image

కడప జిల్లాలో నూతన పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ చేపట్టి ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పేర్కొన్నారు. దీనిపై వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో జేసీ అధ్యక్షతన సమావేశం జరిగింది. జిల్లాలో మొత్తం ఇప్పటికే 1941 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. జిల్లాలో 22 ప్రతిపాదనలు చేశామని, ఇందులో కడపలో 19, ప్రొద్దుటూరులో 1, కమలాపురంలో 2 కేంద్రాలు ఉన్నాయన్నారు.

News October 3, 2024

పెండ్లిమర్రి: పిడుగు పడి ముగ్గురు మృతి

image

పెండ్లిమర్రి మండలంలో గురువారం పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. మండలంలోని తుమ్మలూరు పరిసర ప్రాంతాల్లో పశువులను మేపేందుకు వెళ్లి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పిడుగుపాటు గురై ఓ మహిళ, ఓ అబ్బాయి మరణించారు. అలాగే పగడాలపల్లికి చెందిన మరో యువకుడు ఇసుక తోలుకోవడానికి వెళ్లి మరణించారు. సమాచారం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News October 3, 2024

కడప: భారీగా మొబైల్ ఫోన్ల రికవరీ

image

కడప జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులకు జిల్లా పోలీసులు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు చేతుల మీదుగా బాధితులకు మొబైల్స్‌ను అందజేశారు. దాదాపు రూ.1.8 కోట్ల విలువగల 555 మొబైల్స్‌ను రికవరీ చేసి బాధితులకు అందించారు. ఆపరేషన్ మొబైల్ షీల్డ్ ప్రత్యేక డ్రైవ్ లో సైబర్ క్రైమ్ పోలీసుల సాంకేతిక పరిజ్ఞానంతో పోగొట్టుకున్న మొబైల్స్‌ను కనుగొన్నారు.