News March 18, 2025

ప్రభుత్వ స్థలాలను గుర్తించండి: నంద్యాల కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో అభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో వివిధ అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యుత్ సబ్ స్టేషన్లకు 5 నుంచి 10 ఎకరాలు, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు 50 నుంచి 100 ఎకరాలను గుర్తించాలని సూచించారు. 

Similar News

News March 18, 2025

చిత్తూరు: పాఠశాల పని వేళల్లో మార్పు

image

పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో పని వేళలను మార్పు చేస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్నం 1 నుంచి 5 వరకు పాఠశాలలు నడపాలని గతంలో ఇచ్చిన ఉత్తర్లను మార్పు చేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి 5 వరకు పని వేళలను మార్పు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ పని వేళల్లో పాఠశాలలు నిర్వహించాలని సూచించారు.

News March 18, 2025

భువనగిరి: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా కూలీ బిడ్డ  

image

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు రామన్నపేట(M) వెల్లంకికి చెందిన బలికె తరుణ్ కుమార్. రాష్ట్రంలో TGPSC సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. TGలో 32, 5వ జోనల్‌లో 5 ర్యాంక్ సాధించాడు. ప్రభుత్వ లైబ్రరీలో చదువుకుంటూ ఈ ఘనత అందుకున్నాడు. తండ్రి నర్సింహా ముంబైలో వలస కార్మికుడిగా, తల్లి మహేశ్వరీ గ్రామంలో కూలీ పని చేస్తున్నారు. అతనికి స్నేహితులు సహకారం అందించారు.

News March 18, 2025

కృష్ణా జిల్లాలో పేర్ల మార్పు రాజకీయం

image

కృష్ణా జిల్లాలో పేరు మార్పుల రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జగన్ హయాంలో NTR యూనివర్సిటీని YSR యూనివర్సిటీగా మార్చగా, కూటమి ప్రభుత్వం తిరిగి NTR పేరునే పెట్టింది. ఇప్పుడు YSR తాడిగడపను తాడిగడపగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా NTR స్వగ్రామమైన నిమ్మకూరు కృష్ణా జిల్లాలో ఉండగా దీనికి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.

error: Content is protected !!